మహిళలపై రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన మహిళలకు రక్షణ కరువైంది నేటి సమాజంలో. మహిళలపై వేధింపులకు పాల్పడితే  కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... లైంగిక వేధింపులు తగ్గిన  దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ఆడపిల్ల కనిపిస్తే చాలు మీద పడి  పోయి అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు. ప్రతి చోట మహిళలపై లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. 

 

 

 

 రోడ్డు మీద నడిస్తే ఆకతాయిల నుంచి.. ఆఫీస్ కి వెళ్తే సహోద్యోగుల నుంచి.. చదువుకోవడానికి వెళ్తే చదువు చెప్పే గురువుల నుంచి... ఇంటికి వస్తే సొంత వారి నుంచి ప్రతి చోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు... లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. దీంతో మహిళల జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. కనీసం తమకు ఎక్కడ రక్షణ లేకుండా తాళాలు కాలు బయట  పెట్టాలి అంటేనే  వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిళలకు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ... ఏమవుతుందో అనే భయంతో మహిళలు వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ ఓ మహిళ మాత్రం తన ధైర్యసాహసాలను చాటింది . 

 

 

 

 ఆటో డ్రైవర్ కు సరైన బుద్ధి చెప్పింది ఓ వివాహిత.. అతని ఆటోకి నిప్పుపెట్టి తన కోపాన్ని చూపించింది . దీంతో ఆటోడ్రైవర్ షాక్కు గురయ్యాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఏఎస్ పేట మండలం గుండ్లపాడు కు చెందిన బాదుల్లా అనే ఆటో డ్రైవర్ అదే గ్రామానికి చెందిన వివాహిత ను తరచూ వేధింపులు చేస్తుండేవాడు. ఆమె  పలుమార్లు అతడిని హెచ్చరించినప్పటికీ అతని తీరు మార్చుకోలేదు. దీంతో అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఆ వివాహిత. ఈ క్రమంలోనే మరోసారి ఆ వివాహతను వేధింపులకు గురిచేయడంతో కోపంతో ఊగిపోయిన వివాహిత ఆటోకి నిప్పు పెట్టింది. మంటల్లో దగ్ధమైన ఆటో ని చూసి బాదుల్లా లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కావాలని ఆమె తన ఆటోకి నిప్పు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆటో డ్రైవర్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: