కొంద‌రికి దుర‌దృష్టం దారుణంగా ఉంటుంది. ఒక స‌మ‌స్య త‌ర్వాత మ‌రో స‌మ‌స్య అన్న‌ట్లుగా వారికి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. ఆడ‌వారి విష‌యంలోనే ఇలాంటి ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో మ‌హిళ‌ల‌పై దారుణాలు అధికంగా చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఓ మ‌హిళ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆమెపై ఇద్ద‌రు దుర్మార్గులు రేప్ చేశారు. ఇదే విష‌యాన్ని పేర్కొంటూ ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా...అక్క‌డ ఇంకో షాక్ త‌గిలింది.

 

ఒడిశాలోని కటక్‌లో ఈ చిత్ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. న‌గ‌రంలోని చింతామణిశ్వర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఇద్దరు పురుషులు తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ డిసెంబర్ 16న ఓ మహిళ లక్ష్మీసాగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టు అనుమ‌తితో రిమాండ్‌కు పంపించారు. అయితే, అనంత‌రం అస‌లు ట్విస్ట్ జ‌రిగిన‌ట్లు భువనేశ్వర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనూప్ కుమార్ వివ‌రించారు. `ఆమె ఫిర్యాదు చేసిన సమయంలో ఇచ్చిన వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి చిరునామా లేదని మేము తెలుసుకున్నాము. దాంతో మేము ఆమెను మరింత విచారించగా ఆమె బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్‌కి వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది’ అని డిసీపీ తెలిపారు.

 

`పశ్చిమ బెంగాల్‌లో ఆమె కొంతకాలం మాంసం వ్యాపారం నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఒక నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించి ఆమె ఒడిశాకు వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత ఆమె భువనేశ్వర్‌కి వచ్చింది. ఆమె వద్ద ఎటువంటి పాస్‌పోర్టు కానీ, వీసా కానీ లేవు. ఐపీసీ సెక్షన్లు 419,468,471, విదేశీ చట్టంలోని సెక్షన్ 14 కింద ఆమెపై కేసు నమోదైంది` అని డీసీపీ అనూప్ కుమార్ తెలిపారు.  అంతేకాకుండా, ఎటువంటి దృవీకరణ పత్రాలు లేకుండా భువనేశ్వర్‌లో ఉంటున్న ఈ బంగ్లాదేశ్ మ‌హిళ‌ సెక్స్ వర్కర్ అని పోలీసులు వెల్ల‌డించ‌డ కొస‌మెరుపు. 

మరింత సమాచారం తెలుసుకోండి: