పెళ్లి చూపుల్లో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక పెద్దలు పెళ్ళికి నిశ్చయించారు. పెళ్లికి బంధువులు అంతా వచ్చారు. అంగరంగ వైభవంగా కళ్యాణ వేదిక సిద్ధం చేశారు. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆనందంగా పెళ్లి సందడి జరిగింది. కానీ పెళ్లి జరిగిన  గంటకి పెళ్లి కొడుకు భారీ షాక్. ఏమిటంటే పెళ్లికూతురు గర్భవతి అని తేలింది. దీంతో ఆనందంగా ఉండాల్సిన కళ్యాణ మండపం కాస్త రణరంగంగా మారిపోయింది. ఈ ఘటన చూసి అటు పెళ్లికి హాజరైన బంధుమిత్రులు కూడా షాక్ కి గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... పెళ్లి పీటల మీద వధువు గర్భవతి అయిన ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. బీర్పూర్ గ్రామానికి చెందిన యువతికి .. అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి సంబంధించిన లాంఛనాలు అన్నీ పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి తంతు బంధుమిత్రుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ పెళ్ళి తంతు ముగిసిన వెంటనే ఆ యువతి అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయింది. అయితే ఆ పెళ్లికి వచ్చిన ఓ  డాక్టర్ ఆ యువతిని పరీక్షించి ఆ యువతి ఐదు నెలల గర్భవతి అని తేల్చాడు. ఇక ఈ విషయం తో పెళ్లి మండపం లోని ఇరు కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కయి పోయేరు. 

 

 

 పెళ్లిలో వరుడు మూడు ముళ్ళు వేసి కనీసం గంట సమయం కూడా గడవకముందే... తన భార్య గర్భవతి అని తేలడంతో వరుడు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమను మోసం చేసి ఈ పెళ్లి చేశారు అంటూ వరుడు తరపు బంధువులు.. వధువు తరపు కుటుంబీకులు బంధువులు తో వాగ్వాదానికి దిగారు. దీంతో కళ్యాణమండపం కాస్త రణరంగంగా మారిపోయింది. అయితే ఈ ఘటనపై ఆరా తీయగా... వధువు స్నేహితుడే ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న వధువు స్నేహితుడు ఊళ్ళో  నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: