చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ నేతల్లో కలకలం సృష్టిస్తున్నాయట. పార్టీ నేతల సమీక్షలో  చంద్రబాబు మాట్లాడుతూ  అందరి నేతల జాతకాలు తన దగ్గర ఉన్నట్లు ఎప్పటిలాగనే అందరినీ గద్దిస్తు మాట్లాడారు. అయితే ప్రతిసారి ఈ బెదిరింపును పట్టించుకోని పార్టీ నేతలు ఇపుడు మాత్రం చాలా సీరియస్ అయ్యారట.

 

సమీక్ష అయిపోయిన తర్వాత ఎప్పటిలాగే నేతలు తమ ఊర్లకు, ఇళ్ళకు వెళ్ళిపోకుండా అందరూ చంద్రబాబు ఇంటి ముందు క్యూ కట్టారట. అందరూ ఎందుకు వచ్చారా ? అని కంగారు పడిన చంద్రబాబు నేతలను లోపలకు రమ్మని కబురు చేశారట.  నేతలు లోపలకు వచ్చీ రాగానే  మండిపడ్డారట. ’పార్టీ నేతల్లోని అందరి జాతకాలు మీ దగ్గర ఉన్నపుడు  మొన్నటి ఎన్నికల్లో  23 మందిని మాత్రమే పోటికి దింపితే సరిపోయేది కదా’ అంటూ చంద్రబాబును నిలదీస్తున్నారని సమాచారం.

 

ఎవరు గెలుస్తారో ? ఎవరు ఓడిపోతారో ? ముందే తెలిసినపుడు అసలు పార్టీ గెలుస్తుందో లేదో కూడా తెలిసిపోయిన తర్వాత మొత్తం 175 మంది నేతలను అసెంబ్లీకి, 25 మంది అభ్యర్ధులను ఎంపి స్ధానాల్లో  పోటికి ఎందుకు దింపారంటూ రెచ్చిపోయారట.  గెలవమని తెలిసి కూడా తమకు టిక్కెట్లివ్వటంతో ఎన్నికల్లో కోట్లరూపాయలు తగలేసుకోకోవాల్సొచ్చిందని బోల్డు బాధపడిపోయారట.

 

వీళ్ళందరూ ఇలా బాధపడుతున్న సమయంలోనే  ఇంట్లోనుండి నారావారి పుత్రరత్నం లోకేష్ సర్రున బయటకొచ్చారట. చంద్రబాబుతో మాట్లాడుతూ ’వీళ్ళందరి జాతకాలు తెలిసి కూడా చెప్పలేదంటే అర్ధముంది మరి నా జాతకం తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు’ అంటూ మండిపడ్డారని సమాచారం. మిగిలిన ఓడిపోయినా పర్వాలేదు కానీ తాను ఓడిపోవటంపై వైసిపి నేతలు వేస్తున్న సెటైర్లను భరించలేకపోతున్నట్లు లోకేష్ లబోదిబోమన్నారట.

 

మంగళగిరిలో ఓడిపోతానని తెలిసి కూడా తనను ఎన్నికల్లోకి దింపటం వెనుక ఏమైనా కుట్ర ఉందా ? అని కూడా లోకేష్ అనుమానం వ్యక్తం చేసినట్లు నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి తేల్చుకున్నదేమంటే  ఓడిపోతాడని తెలిసి కూడా కొడుకు జాతకమే బయటపెట్టని చంద్రబాబు ఇక మన జాతకాలు ఏమి చెబుతాడులే అని ఒకళ్ళని మరొకళ్ళు ఓదార్చుకుంటూ బయటపడ్డారట.

(సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెటైర్ )

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: