మద్యం తాగి నేటి యువకులు అత్యంత దారుణమైన నేరాలకు ఒడికడుతున్నారు. పట్టపగలే అమాయకులైన ప్రజలపై రెచ్చిపోయి హింసిస్తున్నారు. తాజాగా అలాంటి ఒక ఘటనే జరిగి కలకలం రేపుతోంది. ఇకపోతే, బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే ఒక వివాహిత చీరని లాగారు ఇద్దరు ఆకతాయి తాగుబోతులు. తమ బైక్ కు సైడ్ ఇవ్వలేదని మహిళ యొక్క భర్తయిన ఆటోడ్రైవర్ ని కూడా విచక్షణ రహితంగా చితకబాదారు. ఈ దారుణమైన సంఘటన అబీద్‌సెంటర్‌ వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కోటవురట్ల మండలం యండపల్లి గ్రామస్థుడైన మూర్తి నానిబాబు ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే, వైద్యం నిమిత్తం తన భార్య రాజేశ్వరి, అతని సోదరుడు అప్పలరాజు కలిసి నానిబాబు ఆటోలో నర్సీపట్నంఏరియా లోని ఒక హాస్పిటల్ కు పయనమయ్యారు. అలా బయల్దేరిన వారి ఆటోని మద్యం తాగిన యువకులు బైక్ నడుపుతూ అబీద్‌సెంటర్‌ వద్ద ఓవర్ టేక్ చేయాలనుకున్నారు. కానీ వాహనాల రద్దీ వలన నానిబాబు వారు ముందుకు వెళ్లడానికి సైడ్ ఇవ్వలేకపోయాడు.


కొంతదూరం వెళ్లిన తరువాత ఆ మద్యం తాగిన యువకులు బొడగ రామకృష్ణ , ఎలిశెట్టి నాగేశ్వరరావులు ఆటోని ఆపుచేసి ఆటోడ్రైవర్ నానిబాబు ఆటో నుంచి కిందికి దించి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో నానిబాబు భార్య రాజేశ్వరి అడ్డువచ్చినందుకు ఆమెను కూడా దూషించడం చేసారు. ఇంకా రెచ్చిపోయి అందరూ చూస్తుండగానే ఆమె చీరను లాగేసారు. అలానే భార్య భర్తలను కులం పేరుతో అసభ్యకరంగా దుర్భాషలాడారు.


ఆ తరువాత బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసారు. దాంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు బొడగ రామకృష్ణ , ఎలిశెట్టి నాగేశ్వరరావులు పై అట్రాసిటీ, ఇంకా తదితర కేసులు నమోదు చేశామని సబ్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: