ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కన్నా లక్ష్మి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. పాలక పక్షం చేసే అభివృద్ధి చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులూ చేసే అల్లరిని.. విజయసాయి రెడ్డి ఎప్పటికప్పుడు అణచివేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ట్విట్టర్ వేధికగా కన్నా లక్ష్మి నారాయణపై చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.  

                       

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్ చేస్తూ ''పాలకులు మారితే రాజధాని మారుతుందా అని కన్నా గారు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రాజధాని ఎక్కడుందో కనిపించిందా? గ్రాఫిక్స్ చూసి మీరూ భ్రమ పడ్డారా? చంద్రబాబుకు సపోర్టుగా మీరెంత వాదించినా పార్టీ అధ్యక్షుడిగా తన మనిషిని నియమించడానికి ఆయన  చేస్తున్న పైరవీలు ఆపడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు నిజమే లెండి అని కొందరు అంటే.. మరి కొందరు వ్యక్తిరేకంగా ట్విట్స్ చేశారు. మరికొందరు నేతలు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పెట్టిన ఈ ట్విట్ తో వైసీపీ అభిమానుల మధ్య బీజేపీ అభిమానుల మధ్య ట్విట్టర్ వేధికగా చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. దీంతో ఈ ట్విట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: