ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఒక్కటే జగన్ ప్రకటించిన మూడు రాజధానిల  అంశం. అసెంబ్లీ  వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానిలు  నిర్మించే అవకాశం ఉందని.. అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోకుండా రాష్ట్రవ్యాప్తంగా జరగాలనే  ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాజధాని అధ్యయనం కోసం నియమించిన కమిటీ కూడా... జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక అందించింది.కాగా  ప్రస్తుతం ఈ అంశమే  హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రకటించిన మూడు రాజధానిల అంశంపైనే ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి . 

 

 

 

 మరోవైపు అమరావతిలో రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ఇలా ఉంటే అటు మీడియా చానళ్లన్నీ దీనిపైన డిబేట్లు పెడుతున్నాయి. రాజకీయ నేతలు అందరిని పిలిచి తమ  అభిప్రాయాలను తెలుసుకొని న్యూస్ చానల్స్ అన్ని డిబేట్ లు పెట్టి మరీ చర్చలు జరుపుతున్నాయి. కొన్ని రోజుల నుండి అన్ని న్యూస్ చానల్స్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధాని నిర్ణయం హాట్ టాపిక్ గా మారిపోయింది.ఏ  క్షణంలో చూసిన 3 రాజదానుల  నిర్ణయం టాపిక్ న్యూస్ చానల్స్ లో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ హాట్ హాట్గా సాగుతున్నాయి. 

 

 

 

 తాజాగా ఓ టీవీ చర్చా కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రాజధాని అంశంపై చర్చించేందుకు ఓ న్యూస్ ఛానల్ చర్చా వేదికను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ చర్చ హోరాహోరీగా సాగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓ మహిళపై నోరు జారారు. టిడిపి అధికార ప్రతినిధి అనురాధ పై అసభ్యంగా మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఏమైనా అంటే ఆడదానివని  కూడా చూడను నాలుక కత్తరిస్తాను అంటూ హెచ్చరించాడు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నీ అంతు  చూడడం పెద్ద విషయమేమీ కాదు జైల్లో వేయిస్తానంటూ హెచ్చరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పై కూడా టిడిపి అధికార ప్రతినిధి అనురాధ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: