కేశినేని నాని.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు దేశం పార్టీ ఎంపీ.. ఎప్పుడు తన పార్టీ తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేసే కేశినేని నాని ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అది రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు అన్నారు. 

                                   

అసలు కేశినేని మాట్లాడుతూ ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో నియంత పాలన కొనసాగుతోంది, జగన్‌ ఒక్కచాన్స్‌ ఇవ్వమని అడిగి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. రాజధాని మార్చడం కరెక్ట్‌ కాదు, రైతులతో సామరస్యంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. రాజధానిపై చట్టపరంగా పోరాడతాం.. పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం, పోలీసులతో ప్రజా ఉద్యమాన్ని అణిచివేయలేరు, చట్టపరంగా రాజధాని మార్పు కుదరదు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                       

రాజధాని మార్పుపై అమరావతి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు టీడీపీ నేతలు హాజరవ్వాలి అనుకోగా.. వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ హౌస్ అరెస్ట్ లో బుద్ధ వెంకన్న, కేశినేని నాని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని ఈ మాటలు మాట్లాడారు. 

 

అయితే ఈ మాటలు ట్విట్టర్ లో పెట్టగా నెటిజన్లు స్పందిస్తూ.. అవును.. మీ చంద్రబాబుకు ఒక్క ఛాన్స్ ఇచ్చి మా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయించుకున్నాం.. ఇప్పుడు మేము సరైన దారిలోనే నడుస్తున్నాం.. వెళ్లి పని చూసుకోండి అంటూ సంచలన కామెంట్స్ చేశారు నెటిజన్లు. దీంతో ఈ ట్విట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: