ఆడపిల్లలపై రోజురోజుకు లైంగిక వేధింపులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఆడ పిల్లలపై ప్రతి చోట లైంగిక  వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించడానికి ఎన్ని కఠిన  చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎవరి లో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కాలు బయట పెట్టాలనే వంద  సార్లు  ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడంలేదు కామాంధులు. 

 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది పశ్చిమగోదావరి జిల్లాలో. వంద రూపాయలు ఇస్తా ముద్దు ఇస్తావా ఓ బాలికను యువకుడు లైంగికంగా వేధించాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో  ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తిమ్మాపురంలో నివాసం ఉంటున్న 12ఏళ్ల బాలిక తండ్రితో కలిసి మంగళవారం మధ్యాహ్నం సమయంలో పుల్లలు ఏరుకునే నిమిత్తం పొలానికి వెళ్ళింది. అయితే అక్కడ పుల్లలు ఏరుకున్నాకా  తండ్రి ముందు వెళ్ళిపోయాడు. 

 

 

 

 అదే సమయంలో రామన్నగూడెం పంచాయితీ దేవినేని వారి గూడెం కు చెందిన మోటమర్రి నాగ సూర్య బాలాజీ అనే యువకుడు బాలిక వద్దకు వెళ్లి పుల్లల మోపును ఎత్తి సాయం చేసాడు . ఆ తర్వాత కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ యువకుడు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. వంద రూపాయలు ఇస్తాను ముద్దిస్తావ అంటూ ఆమె చేయి పట్టుకుని లైంగిక దాడికి యత్నించాడు యువకుడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక కేకలు వేసుకుంటూ అతన్నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది ఆ బాలిక. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: