నరేంద్ర మోదీ.. మన ప్రధాన మంత్రి. పొలిటికల్ గానే కాదు ట్విట్టర్ లో కూడా కింగ్. ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే నరేంద్ర మోడీ ఈరోజు ఓ సంచలన ట్విట్ పై కామెంట్ పెడుతూ మరో సంచలన విషయాన్నీ ట్రెండ్ చేశాడు. ఇంకా అసలు విషయానికి వస్తే.. ఈ రోజు సూర్యగ్రహణం అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే దేశంలో కొన్ని ప్రాంతాలు మేఘా వృతమై ఉండటంతో అనేక మంది సూర్యగ్రహణాన్ని వీక్షించలేకపోయారు.

 

ఆలా ఈ అవకాశాన్ని కోల్పోయిన వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే బాధపడుతూ స్వయంగా ట్వీట్ చేశారు. 'అనేక మంది భారతీయుల్లాగే నేను కూడా సూర్యగ్రహణం కోసం ఆతృతగా ఎదురు చూశాను. దురదృష్టవశాత్తూ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో నేను గ్రహణాన్ని వీక్షించలేకపోయాను. అయితే కోజికోడ్‌ నుంచి వస్తున్న లైవ్ స్ట్రీమ్ ద్వారా ఆ దృశ్యాల్ని చూడగలిగాను. ఈ విషయమై నిపుణలతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను.'' అని ఆయన ట్వీట్ చేశారు.

 

అయితే ఆలా ట్విట్ చేస్తూ సూర్యగ్రహణం వీక్షించేలాని సమయంలో ఆయన దిగిన ఫొటోలు కూడా జత చేసి ట్విట్ చేశారు. దీంతో అయన ఫోటోలను చుసిన సోషల్ మీడియాలోని హాస్యప్రియులకు ఈ ఫోటోల్లో గొప్ప అవకాశం కనిపించింది. అంతే క్షణాల్లో ఈ ఫోటోలపై మీమ్స్  వైరల్ చేశారు. 'జీతం కోసం ప్రతినెలా నేను ఇలాగే ఎదురు చూస్తా' అంటూ జోకులు పేల్చారు. 

 

ఇదే విషయాన్ని వివరిస్తూ ఓ వ్యక్తి ఏకంగా మోదీకి ట్వీట్ చేశారు. 'సార్.. మీ ఫోటోపై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి' అని చెప్పారు. అయితే ఆలా చాలామంది ట్యాగ్ చేస్తారు. అందులో ఆశ్చర్యం లేదు కానీ నరేంద్ర మోదీ ఈ ట్వీట్‌కు వెనువెంటనే స్పందించారు. ఇది ఆశ్చర్యకరంగా మారింది.  

 

నరేంద్ర మోదీ ట్విట్ కి రిప్లై ఇలా ఇచ్చారు.. '' అయితే ఎంజాయ్ చేయండి అంటూ రిప్లై ఇచ్చారు''. ఈ ట్వీట్‌ సూపర్ వైరల్ అయిపోయింది. హాస్యప్రియత్వంలో కూడా తనకు తానే సాటి అని మోదీ నిరూపించుకున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మీరు చాలా కూల్ అండీ’ అంటూ మోదీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. దీంతో మోదీని కూలెస్ట్ పీఎం అని పిలిచారు. 

 

అయితే ఆ జోక్ వేసిన మెమో క్రియేటర్ ట్విట్ ని నరేంద్ర మోడీ రిప్లై ఇచ్చి రీట్వీట్ చెయ్యడంతో వైరల్ గా మారింది. దీంతో వెయ్యి మంది ఉన్న అభిమానులు కాస్త ఆయనకు ప్రస్తుతం ఆయనకు 63వేల మంది అభిమానులు అయ్యారు. ఏది ఏమైనా అయన ఒక్కట్విట్ ఇతని జీవితాన్ని మార్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: