2020 వచ్చే సరికి ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరిగిపోతాయని వంగ బాబా (మాత) చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి.  ప్రపంచంలోని మనుషులు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తారు అని చెప్పిన మాట అక్షరాలా సత్యం సత్యం కాబోతున్నది.  ఈ మాటలకు అనుగుణంగానే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది.  సృష్టికి విరుద్ధంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి.  ఇప్పటి వరకు ఆడపిల్లలకే రక్షణ లేదు అనుకున్నారు.  


కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మగపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతున్నది.  మగపిల్లలు కూడా లైంగికంగా హింసించబడుతున్నారు అన్నది వాస్తవం అని తెలుస్తోంది.  ఇక ఇదిలా ఉంటె, తెలంగాణాలో దిశపై అత్యాచారం, హత్య తరువాత ఈ అత్యాచారాలు తగ్గిపోతాయని అనుకున్నారు.  తగ్గకపోగా పెరిగిపోతున్నాయి.  ఇలా పెరిగిపోవడంతో పాటు మగపిల్లలపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు కామాంధులు.  


కొన్ని రోజుల క్రితం బాచుపల్లిలో ఓ హిజ్రాపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఇది మరవక ముందే నల్గొండ జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలుడిపై కొంతమంది యువకులు దాదాపు 7 నెలల నుంచి అత్యాచారం చేస్తున్నారు.  ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బాలుడు ఉండే ఇంటికి సమీపంలో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉండేవారు.  వీరితో ఈ బాలుడికి స్నేహం కుదిరింది.  ప్రతిరోజూ సాయంత్రం క్రికెట్ ఆదుకోవడానికి వెళ్లిన బాలుడిపై క్రికెట్ ఆట తరువాత లైంగికంగా హింసించేవారట.  


అలా బాలుడిపై గత ఏడు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు.  ఇంట్లో వాళ్లతో చెప్తే చంపేస్తామని కూడా బెదిరించారాట.  వారి బాధలు తట్టుకోలేక బాలుడు తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు.  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.  ఇందులో ఐదుగురు మైనర్లు కాగా, ఒకరు మేజర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  చిన్న వయసులో నెట్ లో నీలి చిత్రాలు చూస్తూ వాటిలో ఉన్నట్టుగా చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు.  మరి వీరికి ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: