కాస్త సెటైర్ గా కాస్త వ్యంగ్యంగా చురకలు వేస్తూ మాట్లాడటంతో వైసీపీ మంత్రి పేర్ని నానిది అందె వేసిన చెయ్యి. విలేకఖరులతో సరదాగా మాట్లాడుతూనే ప్రత్యర్థులపై చెణుకులు విసురుతుంటారాయన.. ఆయన తన తాజా ప్రెస్ మీట్లో.. చంద్రబాబు, లోకేశ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. రాజధాని భూముల్లో అక్రమాలు ఉంటే చర్యలు తీసుకోండి అంటూ ఇటీవల చంద్రబాబు, లోకేశ్ సవాళ్లు విసురుతున్నారు.

 

టీడీపీ నాయకులు, అమరావతి రైతులు కూడా ఇదే మాట అంటున్నారు. కానీ జగన్ సర్కారు ఈ విషయంపై ఏమీ తేల్చడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఇంకా చర్యలు తీసుకోరేంటి అని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ తర్వాత పెట్టి మీడియా సమావేశంలో పేర్ని నాని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 

ఆయన ఏమన్నారంటే.. గడిచిన మూడు నాలుగు మాసాలుగా బాగా భోజనం చేసిన కోడి ఇంటి చూరు ఎక్కి బాగా అరుపులు అరిచినట్లుగా టీడీపీలోని చాలా మంది పెద్దలు, భూములు కొనుగోలు చేసిన వారు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, తెల్లకార్డు ఉన్న ఇంట్లో పనిచేసే వ్యక్తుల ద్వారా ఆస్తులు కొనుగోలు చేసిన వారు.. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే మమ్మల్ని జైల్లో వేయడం అని మాట్లాడుతున్నారు.

 

పాపం పండే రోజు వచ్చేనప్పుడు ఎక్కడ దాక్కోలేరు. ఇవన్నీ ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. న్యాయనిపుణుల సలహా మేరకు లోకాయుక్తా, సీబీఐ, సీబీ సీఐడీకి ఇవ్వడమా అనేది న్యాయ నిపుణుల సలహా మేరకు దమ్ముందా అని మాట్లాడిన వారి కోరికను నెరవేరుస్తాం.. అంటూ సెటైర్ వేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే.. జీ సీఎం చంద్రబాబు అక్రమాలను ససాక్ష్యంగా బయటపెట్టేందుకు జగన్ పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టే కనిపిస్తోంది. రాజధాని భూముల కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా పలువురు మంత్రులు, నేతలకు సంబంధించిన పక్కా ఆధారాలు దొరికాయని మంత్రులే చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: