తన కుమారుడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు  అని ఆ తల్లి విసిగిపోయింది... ఎన్నిసార్లు తీరు  మార్చుకోమని చెప్పినప్పటికీ తన కుమారుడు తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ నే కడతేర్చాలి  అనుకుంది ఆ  తల్లి. అనుకున్నట్లుగానే తన కొడుకు ప్రాణం తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా అందరిని  నమ్మించింది. మతిస్థిమితం లేక తన కుమారుడు ఎక్కడో చనిపోయి ఉంటారు అంటూ నమ్మబలికింది.చివరికి పోలీసులు రంగంలోకి దిగే సరికి అసలు విషయం బయటపడింది. దీంతో స్థానికులు అందరు షాక్ కి గురయ్యారు. రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం పల్లె తండాకు చెందిన 20ఏళ్ల ఇస్లావత్ హరిలాల్ పనీపాటా లేకుండా జులాయిగా తిరిగే వాడు.

 

 

 

 పలుమార్లు తల్లి హెచ్చరించినప్పటికీ అతనిలో మార్పు మాత్రం కనిపించడం లేదు . అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లి చాందీ విసిగి పోయింది. ఇక తన కొడుకు ఎంత చెప్పినా లాభం లేదు అనుకుంది . దీంతో ఈనెల 22న ఇంట్లోనే అతడి గొంతుకు చున్నీ  బిగించి హత్య చేసింది. తన పేగు తెంచుకుని పుట్టిన కన్న బిడ్డనే హతమార్చింది ఈ కన్నతల్లి. ఇక తన కొడుకును చంపిన అనంతరం... మృతదేహాన్ని తీసుకొని సమీపంలోని ముళ్ళ పొదల్లో పడేసింది. ఈ విషయాన్ని ఎవ్వరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. చుట్టుపక్కల ప్రజలందరిని నమ్మించే ప్రయత్నం చేసింది మహిళ. 

 

 

 

 తన కొడుకుకు మతిస్తిమితం లేదని... భోజనం కూడా సరిగ్గా చేసే వాడు కాదని... పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటూ ఆ మహిళ తెలిపింది. ఈ కారణంగానే బయటకు వెళ్ళిన తన కుమారుడు ఎక్కడో చనిపోయి ఉంటాడని అంటూ  చుట్టుపక్కల వాళ్ళని నమ్మించింది. ఇక చుట్టుపక్కల వాళ్లు కూడా ఈ మహిళ చెప్పిన మాటలను నమ్మారు. అయితే అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో... రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అతనిది హత్య అని తేలింది. దీంతో అతని తల్లిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని  అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: