నేటి కాలంలో మనలో కొందరి ప్రవర్తన, వారు చేసిన పనులు గురించి వింటే నిజంగా మన చుట్టూ ఏమి జరుగుతుంది అనేది మాత్రం అర్ధం కాని పరిస్థితి ఎదురవడంతో పాటు, అటువంటివి రాబోయే కాలంలో వారిపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో అనే భయాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో అక్రమ సంబంధాలు, రేప్ లు, హత్య కాండల వంటివి రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఇక మనం చెప్పుకోబోతున్న ఒక ఘటనలో ఏకంగా కన్న తల్లే తన బిడ్డను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పల్లె తండా అనే ప్రాంతానికి చెందిన చాందీ అనే మహిళకు ఇస్లావత్ హరిలాల్ అనే 20 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. 

 

మతిస్థిమితం సరిగా లేని హరిలాల్ పై తల్లి చాందీ కొద్దిరోజలుగా అతడి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో అతడిని సాకుతూ వస్తోంది. అయితే హఠాత్తుగా నిన్న బయటకు వెళ్లిన అతడు ఒక్కసారిగా అక్కడి చెట్ల పొదల్లో మృత్యువాత పడ్డాడని, ఏమి జరిగిందో ఏమో అర్ధం కావడం లేదని చుట్టుప్రక్కలి వారిని నమ్మించింది చాందీ. విషయం పోలీసుల వరకు చేరడంతో, హరిలాల్ ప్రవర్తన గురించి పోలీసులు ఆరా దీశారు. అతడికి మతి స్థిమితం సరిగా లేకపోవడం వలన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏది పడితే అది తింటూ ఉండేవాడని, అటువంటిది ఇవాళ ఈ విధంగా శవంగా కనపడడం ఎంతో బాధగా ఉందని వారితో చెప్పుకొచ్చింది చాందీ. కాగా ఆమె తెల్పిన సమాచారాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు, అతడి మరణంపై పూర్తిగా విచారణ మొదలెట్టారు. 

 

ఇక కొద్దిరోజుల తరువాత విచారణలో భాగంగా చాందీని కూడా పిలిపించి కొన్ని ఆధారాలు చూపించి, హరిలాల్ మరణంపై గట్టిగా ఆరాదీయగా, చివరికి తానే కొడుకుని చీరకొంగుతో ఉరి వేసి చంపేశానని నిజాన్ని ఒప్పుకుంది. దానితో పోలీసులు సహా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు సైతం ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. నిజానికి హరిలాల్ ఆ విధంగా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ, ఏ పని చేయకపోవడం తనకు రుచించేది  కాదని, అందుకే నిన్న అతడిపై తీవ్ర కోపం రావడంతో, చీరకొంగుతో ఉరి వేసి చంపేశానని చాందీ చెప్పింది. నిజం ఒప్పుకున్న అనంతరం ఆమెను స్థానిక కోర్ట్ కి తరలించిన పోలీసులు, విచారణలో ఆమె వెల్లడించిన పూర్తి వివరాలను కోర్టు కి సమర్పించారు. కాగా ఈ వార్త రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపుతోంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: