ఛీఛీ.. ఈ మగవాళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్నారంటే .. ఆడది కనిపిస్తే చాలు ఎలా అయినా లొంగతీసుకోవాలి అనుకుంటారు.. రక్షేషులుగా మారుతున్నారు నీచులు.. నిజానికి వారు రక్షేషులే.. అందుకే ఆడదానిపై ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు. మొన్ననే దిశ నిందితులను కుక్కలను కాల్చినట్టు కాల్చి చంపారు పోలీసులు. 

                       

అయినా భయం లేదు.. ఈ కామనీచులకు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ లో కథ్‌గోదాం ఎక్స్‌ప్రెస్ రైలు స్థానిక పితాంబర్‌పుర్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చేసరికి ఆ ట్రైన్ నుండి ఓ మహిళ ఉన్నట్లుండి బయటకు పడింది. మొదట స్థానికులు అంత ఆమె ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది అని అనుకోగా.. ఆ తరువాత నిజం బయట పడింది. 

                            

వివరాల్లోకి వెళ్తే.. కథ్‌గోదాం ఎక్స్‌ప్రెస్ రైలు నుండి ఆమె బయటకు పడటంతో ఆమెను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె ఎలా పడింది..? ఎందుకు రైలు నుండి పడింది అని పోలీసులు విచారణ జరపగా.. 

                               

రైల్లో ఆ మహిళతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళా ప్రతిఘటించడంతో ఆమెను ఆ దుండగుడు బయటకు విసిరేశాడు అని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసుపై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోగా ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఆ బాధితురాలి పేరు జ్యోతిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: