ఒక వైపు చట్టం తనపని తాను చేసుకుంటూ పోతూనే ఉంటంది. మరో వైపు కీచకులు హత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. లోకంలో ఎక్కడా మహిళలపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. స్త్రీ అంటే ఒక ఆటబొమ్మలా చూస్తున్నారే తప్పా. ఆమెలో ఒక అమ్మను చూడటం మానేసారు.

 

 

కనీసం తాను ఒక ఆడదాని కడుపున పుట్టామనే భావన కూడా రావడం లేదనుకుంటా ఈ కామాంధులకు. ఇలాంటి వారిని చూస్తే మనిషి తోలు కప్పుకున్న తోడెళ్లు సమాజం అనబడే అడవిలో స్వేచ్చగా విహరిస్తున్నాయని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా దిశ ఘటన వెలుగు చూసిన తర్వాత కూడా నేరాలకు అడ్డుపడటం లేక మరింతగా రెచ్చిపోతున్నాయి మృగాలు. అందుకు ఉదాహరనే మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన.

 

 

అదేమంటే 11 మంది దుండగులు ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఆమెపై గత ఏడాదిన్నరగా అత్యాచారం జరుపుతూనే ఉన్నారట. అత్యంత దారుణ ఘటన జరిగింది మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో..వివరాలు తెలుసుకుంటే ఈ జిల్లాలోని వాసాయ్ తాలూకాకు చెందిన 21 ఏళ్ల యువతిని బలవంతంగా లొంగదీసుకున్న ఓ వ్యక్తి.. ఆమెపై తొలుత అత్యాచారానికి పాల్పడి. ఆ తర్వాత మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి ఓ చోట నిర్బంధించి మళ్లీ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు.

 

 

అంతటితో ఊరుకోకుండా అతడితో పాటు మిగతా వాళ్లు కూడా ఈ విషయం చెప్పి, అందరు కలిసి ఆమెను శారీరకంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ క్రమంలో ఆ యువతి  బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయినా ఆ దుండగులు ఆమెపై అత్యాచారాలు చేయడం ఆపనేలేదట.

 

 

ఇకపోతే ఈ నెలలో వారి చెర నుంచి తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యుల చెంతకు చేరి జరిగినదంతా వివరించింది. అనంతరం వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు 11 మంది నిందితులపై కిడ్నాప్,హత్యాచారం,హింస కేసులు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: