విజయసాయి రెడ్డి ఎప్పుడు మాట్లాడిన అది ఖచ్చితంగా ప్రతిపక్ష నేతల గుండెల్లో గుచ్చుకుంటుంది. ప్రతిపక్షాలు వణికిపోయేలా విజయసాయి రెడ్డి మాట్లాడుతారు. విజయసాయి రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. వైసీపీ పార్టీని ఏ ఒక్కరు ఒక్క మాట అన్న కూడా ప్రతిపక్షాలకు ట్విట్టర్ వేధికగా బుద్ది చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.          

 

అటు టీడీపీ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసిన సరే ఒక్క మాట అయినా అనకుండా ఉండరు. ఇంకా మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అయితే ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటారు ఒంటి కాలిమీద లేస్తారు విజయసాయి గారు. అయితే ఎప్పుడు ఫైర్ ఫైర్ అంటూ ఉండే విజయసాయి రెడ్డి నిన్న విశాఖలో ఓ పని చేశారు. 

 

అది ఏంటి అంటే.. విశాఖపట్నంలో వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ వద్ద ఫ్లవర్ షో'ని ప్రారంభించారు. ఈ విషయాన్నీ ఆయనే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు మొన్న కూడా ''సన' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం పెందుర్తిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లు, సోలార్ పవర్,  ఆర్వో వాటర్ ప్లాంట్ ను విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఈ విషయాలను స్వయంగా విజయసాయి రెడ్డి ఏ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: