భారత నంబర్‌వన్‌ మహిళా చెస్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి తన కెరీర్‌లోనే అతి గొప్ప విజయం సాధించింది. నిన్న శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్‌ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. 

 

దీంతో ఆమెను దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా కోరారు. 

 

సీఎం జగన్ అభినందనలత్ రాష్ట్ర ప్రజలందరూ ఆమెను అభినందించారు. దీంతో ప్రస్తుతం సీఎం జగన్ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర ప్రజలందరు ఆమెకు అభినందనలు తెలుపుతూ ఈ ట్విట్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఆమెకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుండి ప్రసంశలు అందుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కోనేరు హంపీని అభినందించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: