పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిరసిస్తూ చెన్నైలోని కొందరు దీనిపై ఆందోళనకారులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. అంతేకాదు దీని కోసం రోడ్లపైనా, కొందరి ఇంటి ముందు ముగ్గులు వేశారు. సీఏఏకి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు రాశారు.
ఇలా చేయడంతో పోలీసులు ఓ నలుగురు మహిళలను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా వారిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. బీసెంట్ నగర్లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో ఆ మహిళలు ఈ ముగ్గులు వేశారు.ఆ ముగ్గుల్లో 'సీఏఏ వద్దు, ఎన్ఆర్సీ వద్దు' అంటూ నినాదాలు రాశారు.ఈ విధంగా సిఏఏకి వ్యతిరేఖంగా పలువురు నినాదాలు జరుపుతున్నారు .వీటన్నిటిని అదుపు చేయడానికి పోలీసులు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు
అసిస్టెంట్ కమిషనర్ సహా పోలీసు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ సిబ్బంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. వారు నిరసన తెలిపేందుకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. అయితే, నిరసన తెలిపేందుకు చెన్నై పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని, అందుకే ఈ వినూత్న పంథాను ఎన్నుకున్నామని నిరసనకారుల్లో అందులో వున్నా వారిలో ఒకరు ఈ విషయాన్నీ తెలిపారు.
డీఎంకే నాయకుడు స్టాలిన్ని రసనకారులను పోలీసులు దుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. 'ఏడీఎంకే ప్రభుత్వ అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు' అంటూ ట్వీట్ చేశారు.సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని నియంత్రించేందుకు తమకు అధికారాలున్నాయని.. చిన్న, చిన్న జన సమూహాలు పెద్ద గుంపులుగా పెరిగి తిభద్రతల సమస్యకు దారితీయొచ్చని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. నిరసనలు అదుపు తప్పకముందే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.