ఈ మధ్య కాలంలో తెలియని వాళ్ళకంటే తెలిసిన వారే ఎక్కువగా ఆడవారి మానాలను దోచుకుంటున్నారని మనం రోజూ వింటున్నాం. అందుకే, ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా.. వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లేకపోతే, అసలుకే ఎసరొస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళ కూడా తన భర్త ఫ్రెండ్ కు చనువు ఇచ్చి తన జీవితాన్ని పాడుచేసుకుంది.


వివరాల్లోకి పోతే, ఢిల్లీలోని గోరేలా పోలీస్ స్టేషన్‌ సమీప ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి నివసించేవాడు. అయితే, అతడు ఒక నేరం చేసినందుకు గానూ.. కోర్టు 2 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దాంతో, అతడు జైలు శిక్షను కొన్ని నెలలుగా అనుభవిస్తున్నాడు. అతని భార్య మాత్రం ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన అతడి స్నేహితుడు ఆమె ఒంటరితనాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఆమె భర్త జైలుకు వెళ్లిన రోజు నుండి అతని స్నేహితుడు ఆమె ఇంటికి అప్పుడప్పుడు వచ్చి సాయం చేసినట్లు నటించేవాడు.


ఒకానొక రోజు బాగా చీకటి పడిన వేళా అతడు ఆమె ఇంటికి వచ్చి, 'ఈరోజు మీ ఇంట్లో పడుకోవచ్చా, అండి', అని వినయంగా అడిగాడు. తెలిసినవాడే కదా! అని.. సరే, రండి అంటూ ఆమె అతడిని లోపలికి పిలిచింది. తరువాత ఇద్దరు వేర్వేరు పడకల మీద పడుకున్నారు. అర్ధరాత్రి అవ్వగానే అతడు ఆమె పడుకున్న బెడ్ వద్దకు వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. అతడి రాకను గ్రహించిన ఆమె.. వెంటనే లేచి కూర్చుంది. అప్పుడు, ఆయన మాట్లాడుతూ, 'మిమల్ని నేను ప్రేమిస్తున్న, మీ భర్త నేరస్తుడు, వాడిని వదిలే, నిన్ను నేను పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటా', అని చెప్పాడు.


'నిజంగా పెళ్లిచేసుకుంటారా?, అని ఆమె ప్రశ్నించగా.. 'హా, నిజంగానే పెళ్లి చేసుకుంటా' అని అతడు వాగ్దానం చేశాడు. నిజమేనా అని ఆమె అనగానే.. హా, రా.. కలిసి పడుకుందాం అంటూ ఆమెను అతడు లొంగదీసుకుని శారీరికంగా వాడుకున్నాడు.ఇక ఆ రోజు రాత్రి నుండి అతడు మోసపు పెళ్లి వాగ్దానాలు చేస్తూ అనేకసార్లు ఆమెని వాడుకున్నాడు. కొన్ని నెలలకు వీరి కలయికకు ఫలితంగా ఆమె గర్భం ధరించింది. అది తెలుసుకున్న ఆ కామాంధుడు ఆమెకు కనిపించకుండా ఉడాయించాడు.


అప్పుడు తాను మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనని ఒకడు పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడి కోసం వెతుకుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: