నమ్మకం, స్నేహం అనే బంధాల ముసుగులో కొందరు ఈ మధ్య కాలంలో దారుణాలకు పాల్పడుతున్నారు. పక్కా ప్రణాళికతో స్నేహితుడి భార్యను లొంగదీసుకున్న ఒక యువకుడు స్నేహితుడి భార్యను గర్భవతిని చేసి అక్కడినుండి పారిపోయాడు. దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలి భర్త ఒక నేరం చేసి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
భర్త జైలులో ఉండటంతో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ఆమెపై ఆమె భర్త స్నేహితుడు ఒకడు కన్నేశాడు. ఆమె భర్త జైలుకు వెళ్లిన తరువాత తరచుగా మహిళ ఇంటికి వస్తూ మహిళకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత నేరస్తుడైన భర్తకు విడాకులు ఇవ్వమని ఆమెను తాను పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇస్తానని చెప్పి నమ్మించాడు. 
 
మహిళ పెళ్లి చేసుకుంటానని అతను చెప్పిన మాటలను నమ్మి అతనికి దగ్గరైంది. స్నేహితుడు భార్యపై కామాంధుడైన ఆమె భర్త స్నేహితుడు చాలా సందర్భాలలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం మహిళ గర్భం దాల్చింది. గర్భం దాల్చిన విషయం మహిళ వెంటనే భర్త స్నేహితుడికి చెప్పింది. ఈ విషయం తెలియడంతో బాధిత మహిళకు చెప్పకుండానే భర్త స్నేహితుడు అక్కడినుండి పరారయ్యాడు. భర్త స్నేహితుడు మోసం చేశాడని తెలియడంతో బాధిత మహిళ షాక్ కు గురైంది. 
 
ఏం చేయాలో పాలుపోని బాధిత మహిళ న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించి భర్త స్నేహితుడు మోసం చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మోసగాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లైన మహిళలు వివాహేతర సంబంధాల వలన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: