సరిహద్దులను జాగ్రత్తగా చూసుకునేటప్పుడు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం చూసుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం చెప్పారు. వారి బంధువులకు ఆరోగ్య కార్డులు, బలగాలకు సంవత్సరానికి 100 రోజులు సెలవు అని ప్రకటించారు. ఆగస్టు-సెప్టెంబర్ 2020 నాటికి ఈ నిర్ణయం అమలు చేయబడుతుంది చెప్పుకొచ్చారు.


ఢీల్లీలోని సిఆర్‌పిఎఫ్ యొక్క కొత్త ప్రధాన కార్యాలయం యొక్క ఫౌండేషన్(పునాది) వేడుకలో మాట్లాడుతూ, పంజాబ్, త్రిపుర నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో, రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించడంలో సిఆర్పిఎఫ్ జవాన్లు కీలక పాత్ర వహిస్తున్నారని వాళ్ళని మెచ్చుకున్నారు.


నక్సల్స్ లేదా అల్లర్లను పరిష్కరించడం, అమర్‌నాథ్ యాత్ర యాత్రికులకు, పార్లమెంట్ హౌస్‌కు భద్రత కల్పించడానికి సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఎప్పుడూ ముందంజలో ఉంటారని ఆయన అన్నారు. పారామిలిటరీ దళాల కోసం వివిధ సంక్షేమ పథకాలను 2020 ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.



అన్ని జవాన్లకు వారి కుటుంబాలతో గడపడానికి సంవత్సరానికి కనీసం 100 రోజులు సెలవు ఇవ్వడం, అఖిల భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో కలిసి చెక్-అప్, ఇంకా ఇతర వైద్య సదుపాయాల కోసం ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను కుటుంబ సభ్యులకు అందించడం వంటివి ఇందులో ఉన్నాయి. జవాన్ల యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని 280 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మిస్తుంది.


దీంతో అమిత్ షా ను నెటిజన్లు బాగా కొడియాడుతున్నారు. జవాన్లకు తప్పనిసరిగా సెలవులు ఉండాలని అలోచించి, వారి కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం కల్పించిన అమిత్ షా కు జవాన్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ లు కూడా గుసగుసలాడుతున్నాయి. ఏదేమైనా బీజేపీ పాలనకి హాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: