భూములిచ్చిన రైతులు తమహక్కులకోసం న్యాయపరంగా ఆందోళన చేస్తుంటే, వారిని, వారిత్యాగాలను చులకనచేస్తూ మాట్లాడటం, మహిళలు, వృద్ధులు, చిన్నారులనే గౌరవం లేకుండా పెయిడ్‌ఆర్టిస్ట్‌లని సంబోధించడం, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు,  ఆపార్టీ అనుబంధ మీడియాసంస్థలకు ఏమాత్రం తగదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే  బొండా ఉమామహేశ్వరరావు హితవుపలికారు. తన డబ్బుపిచ్చికోసం, విశాఖలో తనకు, తనఅనుచరులకు ఉన్న భూములవిలువ పెంచుకోవడం కోసమే, ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పేరుతో తమబతుకుల్ని రోడ్డునపడేశాడని రైతులు వాపోతున్నారన్నారు. 13రోజు లుగా రాజధానిలోని 29గ్రామాల్లోని వారంతా తమ ఆందోళనలు వ్యక్తంచేస్తుంటే  ప్రభుత్వం వారిని కించపరిచేలా, భూములిచ్చినవారి త్యాగాలను అపహాస్యంచేసేలా  విషప్రచారం చేయడం వ్యక్తులకు, సంస్థలకు మంచిదికాదన్నారు. 

 

తమను అపహాస్యం చేశారన్న బాధతో ఒక టీవీఛానల్‌ ప్రతినిధులను రైతులు ప్రశ్నిస్తే, దానిపై 307కింద అర్థరాత్రివేళ రైతుల్ని అరెస్ట్‌చేయడం దారుణమన్నారు. రైతులపై హత్యాయత్నం కేసు ఎలా పెడతారని ప్రశ్నించడంతో, ఆకేసు తీసేసి, వారిపై దొంగతనం కేసుమోపారన్నారు.  5కోట్లమంది కలలరాజధానికోసం భూములిచ్చిన రైతులు, వైసీపీప్రభుత్వానికి దొంగలు, హంతకుల్లా కనిపిస్తున్నారా అని బొండా ప్రశ్నించారు. విలేకరులపై దాడిజరిగితే చంద్రబాబు స్పందించలేదంటున్న మంత్రి పూర్వాపరాలు తెలుసుకుంటే మంచిదన్నారు.   వైసీపీఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మహిళా ఎంపీడీవో ఇంటికెళ్లి అర్థరాత్రి వేళ చంపేస్తానని బెదిరిస్తే, ఆయనపై ఒకచిన్న పెట్టీకేసు పెట్టి, పావుగంటలో బెయిలిచ్చి ఇంటికి పంపించారని, అదే ఎమ్మెల్యే ఒకపత్రికా సంపాదకుడిని చంపుతానని బెదిరిస్తే,     సదరు సంపాదకుడు భయంతో కొన్నాళ్లపాటు ఎవరికీతెలియకుండా తలదాచుకున్నాడని   బొండా తెలిపారు. 


తునిలో సత్యనారాయణ అనే విలేకరి హత్యకు ఎవరుకారణమో    మంత్రి తెలుసుకోవాలన్నారు. ఏడునెలల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని విలేకరు లపై దాడులు చేయించి, హత్యలు చేయించిన వైనాన్ని రాష్ట్రప్రజలెవరూ మర్చిపోలేదన్నా రు. మహిళా అధికారిని బెదిరించిన ఎమ్మెల్యేపై చిన్నకేసు పెట్టడం.. రాజధాని రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టడమేనా జగన్‌ పరిపాలన అని ఉమా నిలదీశారు.  సీనియర్‌ పాత్రికేయులు శేఖర్‌గుప్తా, పక్కరాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలే జగన్‌ పనితీరుకు, పాలనకు నిదర్శనమనే విషయాన్ని మంత్రులు అర్థంచేసుకోవాలన్నా రు. వైసీపీ అధికారంలోకి వస్తే, తెలంగాణ పంట పండుతుందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అక్షరసత్యాలయ్యాయన్నారు. 

 

వైసీపీ పుణమా అని పక్కరాష్ట్రంలో సంబరాలు చేసుకుంటు ంటే, రాజధానిలోని రైతులేమో తమఇళ్లలో తాము నివసించడానికి కూడా గుర్తింపుకార్డు లు చూపాల్సిన దుస్థితి దాపురించడానికి వైసీపీప్రభుత్వమే కారణమన్నారు. ఒకపథకం ప్రకారం అమరావతిని చంపేసిన రాష్ట్రప్రభుత్వం, విశాఖలోని తమభూములను అమ్ము కోవడానికి, తెలంగాణలోని రియల్‌ఎస్టేట్‌ రంగాన్ని బాగుచేయడానికి, జీఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌కమిటీ, హైపవర్‌ కమిటీలంటూ అన్నివ్యవస్థలను సర్వనాశనం చేసిం దన్నారు. పత్రికరంగాన్ని, విలేకరులను గౌరవించే సంస్కృతి తెలుగుదేశానికి ఆదినుంచి ఉందని, టీడీపీ పాలనలో విలేకరులపై స్వేచ్ఛగా తమవిధులు నిర్వర్తించారన్నారు.


రాజధాని కోసం ఏర్పాటుచేసిన జాయింట్‌యాక్షన్‌ కమిటీకి, అమరావతి పరిరక్షణ సమితికి టీడీపీ మద్ధతు ఉంటుందన్నారు. తమ అవినీతిని, అసమర్థతను కప్పిపుచ్చుకో వడానికే రాష్ట్రప్రభుత్వం రూ.లక్షకోట్ల బూచిని చూపుతూ, అమరావతిని చంపేసిందన్నా రు. 5ఏళ్లలో రూ.10వేలకోట్ల ఖర్చుతో అమరావతిని 60శాతానికిపైగా గతప్రభుత్వం పూర్తిచేసిందని, మరో రూ.10వేలకోట్లు ఖర్చుపెడితే రాజధాని పూర్తవుతుందన్నారు.   స్వలాభంకోసం పనిచేయకుండా, 13జిల్లాల అభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించాల  ని ఉమా ప్రభుత్వానికి హితవుపలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: