రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి   ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు మున్సిపల్‌ ఎన్నికల విషయంలో పెట్టుకోవద్దని సూచించారు.ఓటర్ల  జాబితాలు వార్డులవారీగా  , రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే జనవరి 7న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. రిజర్వేషన్లు లేకుండా  ఓటర్ల జాబితాలు, నోటిఫికేషన్‌ ఇవ్వడం అసాధ్యమని తెలిపారు.ప్రభుత్వ అనుమతితోనే ఈనెల 24న  కొత్త మున్సిపల్‌ చట్టంలోని 195, 197 సెక్షన్లకు అనుగుణంగా  మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశామని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని స్పష్టంచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ జారీ విషయంలో  కొత్త పద్థతి పాటించిందని,  వచ్చేనెల 7న నోటిఫికేషన్‌ను  బహిర్గతం చేయాల్సి ఉండగా, ముందుగానే 24న  షెడ్యూల్‌ను విడుదల చేసిందని.. తద్వారా పార్టీలు, ఓటర్లను ముందుగానే ఎన్నికలకు సిద్ధం చేసినట్టు అయిందన్నారు.

 

దీనిపై  నాగిరెడ్డి ఎస్‌ఈసీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంతో కుమ్మక్కై తొందరపాటుతో షెడ్యూల్‌ జారీ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ చట్టం, ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా  ఎన్నికలు జరుగుతాయన్నారు.నాగిరెడ్డి మున్సిపల్‌ ముసాయిదా ఓటర్ల జాబితా అసెంబ్లీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రాతిపదికన  సిద్ధమైందని తెలిపారు. ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకుని,జనవరి 2 వరకు  ఏవైనా అభ్యంతరాలుంటే  ఫిర్యాదు చేయొచ్చన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మున్సిపల్‌ ఓటర్ల జాబితాలో లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తే మున్సిపల్‌ కమిషనర్లు సరిచేస్తారని వివరించారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు లేకున్నా.. జనవరి 6 వరకు ఫారం–6, 7, 8 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

 

 వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాలు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో జనవరి 4న అందుబాటులోకి వస్తాయన్నారు. 7న నోటిషికేషన్‌ విడుదల తర్వాత  రిటర్నింగ్‌ అధికారులు 8న ఓటర్ల జాబితాలను నోటీ సు బోర్డులపై ప్రదర్శిస్తారని, అదే రోజునుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. టీ పోల్‌ సాఫ్ట్‌వేర్‌తో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను పాటు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు నాగిరెడ్డి తెలిపారు. ఓటరు స్లిప్పులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్ల కోసం వచ్చేనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్‌ డైరెక్టర్, మున్సిపాలిటీల వార్డులకు జిల్లా కలెక్లర్లు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని వివరించారు. జనవరి 4న సాయంత్రానికి రిజర్వేషన్లను పూర్తి చేసి 5న వెల్లడిస్తామన్నారు.


 ప్రతి అంశాన్నీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నిశితంగా పరిశీలించి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులను  ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేశారు. సోమ వారం  ఓ ప్రైవేటు హోటల్‌లో మున్సిపల్‌ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా`ట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు పరిశీలకులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల విషయంలో వ్యయ పరిశీలకులు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: