నందమూరి బాబాయ్ అబ్బాయి మధ్య సంబంధాలు గతంలో హాట్ టాపిక్ గా ఉండేవి. జూనియర్ సినిమాలపై బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ చేసేవారు. ఈ ప్రభావం చాలాకాలం ఉంది. అయితే హరికృష్ణ మరణం తర్వాత సీన్ కాస్త మారింది. బాబాయ్ అబ్బాయ్ ఇప్పుడు బాగానే ఉంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత అన్న కొడుకులను అక్కున చేర్చుకున్నాడు బాలయ్య. అన్నీ తానేయై చూసుకుంటున్నాడని టాక్ ఉంది.

 

ఆ మధ్య ఎన్టీఆర్ అరవింద సమేత.. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలకు కూడా వచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకు వచ్చాడు. ఇక ఇప్పడు తాజాగా ఓ వార్త నందమూరి ఫాన్స్ కు మరింత కిక్ ఇవ్వబోతోంది. అదేంటంటే.. నందమూరి హీరోలు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు.

 

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా’ చిత్రం రూపొందిందిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కల్యాణ్ రామ్ .. మెహ్రీన్ నటించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8వ తేదీన హైదరాబాద్ లో జరపాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఈ వేడుకకి బాలకృష్ణఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నట్టు సమాచారం.

 

అలా ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలను చూసే అవకాశం లభించడం పట్ల నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమేశ్ గుప్తా .. సుభాశ్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 15వ తేదీన ఈ సినిమాను విడుదల కానుంది. అందుకే ఆ శుభ ఘడియ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: