తనలో అర్ధ భాగమైన కట్టుకున్న భార్య విషయంలో ఓ భర్త చాలా అమానుషంగా ప్రవర్తించాడుగా. తాను చెప్పిన మాట వినడం లేదన్న ఒకే ఒక్క కోపంతో రగిలిపోయిన ఆ భర్త చేజేతులా నిలువునా తగలపాటేసాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తుంది. 2019 సంవత్సరం తెలంగాణ ఆడబిడ్డలకు కాల్సివచ్చినట్టుగా లేదు. ఈ ఏడాది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అవి చాలవన్నట్టుగా దారుణమైన హత్యలు కూడా సంభవించాయి.  అవి కూడా క్షణికావేశాలతోనే జరగడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ సంఘటనను పరిశీలిద్దాం.   

గుట్కా తినడం మానేయాలని..
ఆటోడ్రైవర్‌గా పని చేసే కిరణ్‌ మద్యానికి, భార్య సుకన్య గుట్కాకు బానిసయ్యారు. అయితే గుట్కా తినడం మానేయాలని కిరణ్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. కానీ ఆమె భర్త మాటలను లక్ష్యపెట్టలేదు. ఈ క్రమంలో 2010 డిసెంబర్ 31న మరోసారి గుట్కా విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కిరణ్‌ భార్య సుకన్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేసి ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. 

రూ.2,000 జరిమానా ..
కేసు విచారించిన సైబరాబాద్‌ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. గుట్కా తినడం మానడం లేదనే కోపంతో కట్టుకున్న భార్యను సజీవ దహనం చేసిన కిరణ్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. అదనపు పీపీ రాము కథనం ప్రకారం.. మేడ్చల్‌ మండల కేంద్రానికి చెందిన పిట్ల కిరణ్‌, సుకన్యలకు 2010లో వివాహం జరిగింది. 2010 డిసెంబర్ 31న మరోసారి గుట్కా విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కిరణ్‌ భార్య సుకన్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం కిరణ్‌పై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: