రోడ్డు ప్రమాదాలు గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా జరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు నుంచి ఫిర్యాదు అందగానే పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా స్పందన ద్వారా వచ్చే ఫిర్యాదులను చాలా తొందరగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. 

మహిళలకు రక్షణ..

గుట్కా, గంజాయి, అక్రమంగా ఇసుక తరలింపు వంటి విషయాల్లో పోలీసులు కఠినంగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి' నుండి మహిళలకు రక్షణ మరింత పెరిగిందన్నారు. దిశ చట్టం వచ్చిన తర్వాత  మహిళలకు భద్రత మరింత పెంచడంతో పాటు శిక్షలను మరింత కఠినతరం చేసాము.మైనర్ బాలికలను మోసగించే వారిపై ఫోక్సో చట్టం కింద కేసు పెడుతున్నాం. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. సైబర్ క్రైం కింద 122 కేసులు కట్టామన్నారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని డిజిపి చెప్పారు. మైనర్ బాలికలను మోసగించే వారిపై ఫోక్సో చట్టం కింద కేసు పెడుతున్నామన్నారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. 

ఏపీ పోలీసులకు మంచి పేరు..
దేశంలోనే ఏపీ పోలీసులు మంచి పేరు గడించారని డిజిపి ప్రశంసించారు. ఆరు అవార్డులు రావడమే ఎక్కడి పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలకు తార్కాణమన్నారు. క్రైం రేటు గత ఏడాది కంటే 6 శాతం తగ్గిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.  రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 8 నుండి 9 శాతం తగ్గాయని, జిల్లాలో మాత్రం ఒక శాతం పెరిగిందని తెలిపారు. వాటిని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, గొడవలకు పాల్పడేవారు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గొడవలు జరిగాక చర్యల కంటే అవి తలెత్తకుండానే జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సక్సెస్ అవుతున్నారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: