గతంలో ఫేసుబుక్, వాట్సాప్ సోషల్ సైట్ల ద్వారా అమాయకపు ఆడవారిని వలలో వేసుకున్న కామాంధులు.. ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఆడవారిని మోసం చేసి వారి మానాలను తీసేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకొని కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత సంఘటన ముంబాయిలోని కుర్లా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ పది వారాల గర్భవతి ని ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేయడంతో ఆమె గర్భంలోని బిడ్డ చనిపోయింది.


వివరాల్లోకి వెళితే, ఒకరోజు శుభమ్ జాదవ్ అనే 23 ఏళ్ల యువకుడు, భోపాల్ కి చెందిన ఒక గర్భవతితో పబ్జి ఆన్లైన్ గేమ్ ఆడాడు. గేమ్ ఆడుతున్న సమయంలో వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత గేమ్ స్నేహితులయ్యి ప్రతిరోజు పబ్జి గేమ్ ఆడుతూ పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుభమ్ జాదవ్ ఆమెకు బాంద్రా లో బ్యూటిషన్ జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడు మంచి వాడైనని అనుకున్న ఆ గర్భవతి సెప్టెంబర్ 30వ తారీఖున భోపాల్ నుంచి బయలుదేరి ముంబై కి వెళ్ళింది. దాదర్ రైల్వే స్టేషన్ దగ్గర ఆమెను కలిసిన శుభమ్ జాదవ్, అక్కడినుండి ఆమెను కుర్లా లోని ఓ హోటల్ కి తీసుకు వెళ్ళాడు. ఆమె తినే ఆహారంలో మత్తు మందు కలిపాడు. ఆ రాత్రి భోజనం తిన్న ఆమె మత్తు లోకి దిగిపోయింది.


ఆ గర్భవతి ప్రకారం.. 'డిన్నర్ చేసిన తర్వాత నేను సోయి లేకుండా పడుకున్నాను. నేను లేచినప్పుడు జాదవ్ నాకు ఎదురుగా కూర్చున్నాడు, అప్పుడు నా ఒంటి మీద బట్టలు లేవు. తనని వెళ్ళిపోమని నేను చెప్పాను.. అప్పుడు అతడు రికార్డు చేసిన ఒక వీడియో ని చూపించి.. ఎవరికైనా చెప్తే ఆ వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తానని బెదిరించాడు', అని చెప్పింది.


ఎఫ్ఐఆర్ ప్రకారం... అక్టోబర్ ఒకటవ తారీఖున జాదవ్ ఆమెను వల్సాద్ కు తీసుకు వెళ్ళాడు. మరుసటి రోజు అనగా అక్టోబర్ 2వ తారీఖున.. జాదవ్ ఇద్దరు స్నేహితులు గౌరవ్ కులకర్ణి, శ్రవణ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు.


మరోవైపు భోపాల్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు భర్త. దీంతో, భోపాల్ పోలీసులు యువతి ఫోన్ నెంబర్ కు కాల్ చేసారు. ఒక సందర్భంలో, స్విచ్ ఆన్ చేసి ఆమె మొబైల్ ను పరిశీలించగా పోలీసులు ఫోన్ చేస్తున్నారన్న విషయం జాదవ్ కు అర్థమైంది. దాంతో ఆ గర్భవతిని పలుమార్లు రేప్ చేసి.. ఆపై ఆమెను వదిలేసి అక్కడినుండి పారిపోయాడు.


అప్పుడు, ఆమె వల్సాద్ వదిలిపెట్టి భోపాల్ లోని తన భర్త దగ్గరకు చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు తనకు జరిగిన లైంగిక దాడిని గురించి రాతపూర్వకంగా తెలియజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: