ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయంపై అమరావతి వ్యాప్తంగా  ఎంతల  నిరసనలు వ్యక్తమవుతున్నయో విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్ష పార్టీలు అయిన టిడిపి జనసేన పార్టీ లు అమరావతిలో పర్యటిస్తూ రైతులను కలిసి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రర్యటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం అమరావతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అందుకే మూడు ప్రాంతాల ప్రకటన చేసిందని ఆయన విమర్శించారు. 

 

 

 హైకోర్టును  తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని ఆ విషయం సుప్రీం కోర్టు పరిధిలో ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్నూలుకు హైకోర్టును తరలిస్తామని చెబుతున్న  జగన్మోహన్ రెడ్డి సర్కారు రాయలసీమ ప్రజలను కూడా మోసం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంతేకాకుండా లెజిస్లేటివ్ అసెంబ్లీ ని విజయనగరంలో పెట్టాలంటూ రాజధాని అధ్యయనం కోసం జగన్ సర్కార్ నియమించిన జిఎన్  రావు కమిటీ చెప్పిందని... విశాఖలోని భీమిలిలో పరిపాలన రాజధాని పెట్టాలని జిఎన్ రావు కమిటీ చెప్పలేదంటు  ఆరోపించారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలను కూడా ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని పవన్ విమర్శించారు . 

 

 

 

 భూములు  అమ్ముకోవడానికో.. ఇంకేదో...  రకరకాల ఆలోచనలు చేస్తున్నారని... వారి బుర్ర లో ఏముందో నాకైతే అర్థం కావడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎర్రబాలెం లో రైతులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంత మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై ఆందోళనలు చేయడం తనను ఎంతగానో బాధిస్తుందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను వైసీపీ నేతలు పశువుల గా అభివర్ణిస్తూ ఉండడం దారుణమని ఆయన అన్నారు. ఏ గొడవైన మొదట చిన్నగానే  ప్రారంభమవుతుందని నెమ్మదిగా తీవ్రరూపం దాలుస్తుంది అంటూ ఆయన తెలిపారు. అమరావతి రైతులందరూ రాజధాని కోసం పోరాటాన్ని ఆపకూడదు ఇలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటాన్ని పోలీసుశాఖ మానవతా దృక్పథంతో చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 151 సీట్లు శాశ్వతం కాదని...  ఇవి ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: