సెక్స్ ఎడ్యుకేషన్.. దీని గురించి అంతా క్లాసులు చెప్పేవారే.. కానీ ఇదే విషయం ఓ హీరోయిన్ మాట్లాడితే పెద్ద ఇష్యూ అయ్యింది. ఏకంగా ఓ పార్టీ వాళ్లు ఆమెపై కేసు పెట్టారు. చివరకు ఆమెను జైల్లోకూడా పెట్టారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా.. ఆమె నటి ఖుష్బూ.. ఒకప్పటి టాప్ హీరోయిన్.
2005లో ఖుష్బూ ఒక పత్రికకు నేను వ్యాసం రాసింది. ఎయిడ్స్, సెక్స్ ఎడ్యుకేషన్, అసురక్షిత లైంగిక చర్యలు ఈ అంశాలను చెబుతూ రాసింది. దాన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థానికి ఉపయోగించుకున్నాయి. ఖుష్బూపై కేసు పెట్టారు. దీంతో మేటూర్ కోర్టు నుంచి నాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. కావాలనే వాళ్లు శుక్రవారం సాయంత్రం వారెంట్ ఇచ్చారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో అప్పుడు అరెస్ట్ అయితే, జైల్లో ఉండాల్సి వస్తుందని, ఖుష్బూ తన పిల్లలను తీసుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయింది.
సోమవారం మద్రాస్ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తే కుదరలేదు. అప్పుడు కమల్ హాసన్ యూఎస్లో ఉన్నారు. ఏం జరిగిందో ఆయనకు తెలుసు. దీంతో ఖుష్బూకు ఫోన్ చేసి, ‘నువ్వు ఏ తప్పూ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్లి కోర్టులో సరెండర్ అవ్వు’ అని సలహా ఇచ్చారట. ఆమె వెళ్లి లొంగిపోయింది. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది. ఈ కేసును ఐదేళ్ల తర్వాత 2010లో సుప్రీంకోర్టులో ఖుష్బూ గెలిచింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్హాసన్తో తన అనుబంధం గురించి వివరిస్తూ ఈ విషయం చెప్పింది ఖుష్బూ. కమల్ అయితే కలిసి నటిస్తా.. రజనీతో చేయను అన్నారట ఎంతవరకూ నిజం? అని అడిగితే.. రజనీ సర్, కమల్తో కలిసి చాలా సినిమాల్లో నటించాను. ఇవన్నీ పుకార్లు. అయితే, కమల్ సర్ నాకు మంచి స్నేహితుడు. రజనీగారు మంచి సహనటుడు అంతే, నా స్నేహితుడని నేను చెప్పలేను అంటూ వివరించింది ఖుష్బూ.