చంద్రబాబునాయుడుకు నిద్రకూడా పట్టటం  లేదా ?  ఎవరైనా చెబితే అనుమాలించేల్సిందే కానీ స్వయానా ఆయన భార్య నారా భువనేశ్వరి చెబితే నమ్మకుండా ఎలాగుంటారు ?  రాజధాని వివాదంలో గడచిన 15 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇందులో భాగంగానే భర్త చంద్రబాబుతో కలిసి నారా భువనేశ్వరి  ఎర్రబాలెంలో  దీక్షలో కూర్చున్నారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా కాలంగా చంద్రబాబుకు సరిగా నిద్రకూడా పట్టటం లేదన్నారు. ఒకవేళ నిద్రపట్టినా నిద్రలో కూడా రాష్ట్రం గురించే ఆలోచిస్తుంటారు అంటూ చెప్పారు.  అధికారంలో ఉన్న ఐదేళ్ళు కనీసం తన గురించి, కొడుకు, కోడలు, మనవడు గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదంటూ ఫిర్యాదు చేసినట్లుగా భువనేశ్వరి సెంటిమెంటును పండించే ప్రయత్నం చేశారు.

 

చంద్రన్న ఉన్నత ఆశయాల కోసమే పనిచేశారట. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న విషయంలోనే చంద్రబాబు నిరంతరం ఆలోచించినట్లు చెప్పారు. మొత్తం మీద అమరావతిని తరలించకుండా  చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆందోళనల్లో భువనేశ్వరి కూడా పాలుపంచుకున్నారు. నిజానికి భువనేశ్వరి ఇంతకాలంలో ఏనాడు దీక్షలు, ఆందోళనల పేరుతో రోడ్లపైకి వచ్చింది లేదు.

 

 ఇపుడు జరుగుతున్న ఆందోళనల్లో రైతులు ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారనే  ఆరోపణలు, ప్రచారాలు జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారనే ఆరోపణల నేపధ్యంలో వ్యూహాత్మకంగా చంద్రబాబు అండ్ కో మహిళలను రంగంలోకి దింపారు. ఇపుడు జరుగుతున్న ఆందోళనల్లో  మహిళలనే ముందుంచి వ్యవహారం నడిపిస్తున్నారు.

 

మహిళలు ఎప్పుడైతే ముందు వరసలో కూర్చుంటున్నారో వెంటనే సెంటిమెంటు పరంగా చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని రంగంలోకి దింపారు. ఆమె కూడా యధాశక్తి తన పాత్రను పండించినట్లే అనిపిస్తోంది. తన భర్త చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఏ స్ధాయిలో కష్టపడ్డారో చాలా వివరరంగానే చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ  నిజంగానే చంద్రబాబు అంత కష్టపడితే, నిప్పులాంటి వారైతే మరి జనాలు ఎందుకు అధికారంలో నుండి దింపేశారు ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: