రాష్టంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న ధీమా రైతుల్లో ఏర్పడిందని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. అయితే చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతుల వాస్తవ పరిస్థితిని వివరించారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం రైతులకు అందిసున్న ప్రయోజనాలను పేర్కొన్నారు.  రైతులకు సంక్రాంతి కానుకగా ‘రైతు భరోసా’  అందచేస్తామని . తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గత సంవత్సరం తరహాలో 2020ని కూడా రైతు నామ సంవత్సరంగా కొనసాగిస్తామన్నారు.

జగన్‌ ఉన్నారనే ధీమా..

 సీఎం జగన్‌ ఉన్నారనే ధీమా రైతుల్లో నెలకొందని ఆయన అన్నారు. ‘ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అందించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కౌలు రైతులకు రైతు భరోసా అందచేశారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన పీఎం కిసాన్‌ రైతు భరోసా ఒక ఏడాది ముందు నుంచే ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.2వేలు త్వరలో పడుతుంది. సీఎం జగన్‌ మొత్తం బడ్జెట్‌లో 12.66 శాతం నిధులు వ్యవసాయానికే కేటాయించారు. పగటిపూట రైతులకు 9 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తున్నాం’ అని తెలిపారు.

రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించారు. పశువులకు ఉచితంగా పశు బీమా అందించారు. చంద్రబాబు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ హామీలను నిలబెట్టుకోలేదు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నాం. చనిపోయిన రైతులను చంద్రబాబు పట్టించుకోలేదు. రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్‌ ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని 15 శాతం పెంచారు.

ఆక్వా రైతులకు విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.1.50 పైసలకే అందిస్తున్నారు. వరదలు మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. పంటలకు సున్నా వడ్డీకే రుణాలు, పప్పు, చిరు ధాన్యాలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాము. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. దివంగత నేత స్వర్గీయ  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను రైతులకు... ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 90 శాతం మేర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని నాగిరెడ్డి  స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: