చంద్రబాబునాయుడు వాడకం ఎలాగుంటుందో ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తాను కష్టాల్లో ఉన్నపుడల్లా  చంద్రబాబుకు గుర్తుకొచ్చే ఏకైక విషయం ఎన్టీయార్ ఫ్యామిలి. అవును ఎప్పుడన్నా చూడండి తాను ఇబ్బందుల్లో ఉన్నాను అనుకునప్పుడల్లా వెంటనే ఎన్టీయార్ ఫ్యామిలిని అడ్డం పెట్టుకుంటారు. ఎందుకంటే సానుభూతిని సంపాదించుకోవటానికే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఎర్రబాలెంలో జరిగిందిదే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి తమను ఎంత దారుణంగా మోసం చేశాడో  తెలిసి కూడా మళ్ళీ పిలిచినపుడల్లా వచ్చేస్తున్నారు. తాజగా రాజధాని అమరావతి గ్రామాల్లో  భార్య భువనేశ్వరితో పాటు బావమరది నందమూరి రామకృష్ణను ఆయన కొడుకును కూడా తీసుకొచ్చారు. సరే భార్య, బావమరిది వచ్చినందు వల్ల ఏమవుతుందన్నది వేరే విషయం.

 

అవసరానికి దగ్గరకు తీసుకోవటం అవసరం తీరిపోగానే దూరంగా విసిరేయటంలో చంద్రబాబును మించినోడు లేడన్నదే ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కుకట్ పల్లి నియోజకవర్గంలో పోటి చేయించారు. ఆమేమో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత ఆమెతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. 

 

బతికున్నంత కాలం  హరికృష్ణను దారుణంగా అవమానించి  చనిపోయిన తర్వాత ఆయన కూతురిని కూడా ఎన్నికల్లో దింపి మోసం చేయటం చంద్రబాబుకే చెల్లింది. పిలనిచ్చుకున్న తర్వాత బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చంద్రబాబును మోయక తప్పదు. మరి మిగిలిన వాళ్ళకు ఏమవసరం వచ్చింది ? అధికారంలో ఉన్నంత కాలం ఎన్టీయార్ ఫ్యామిలిలో ఎవరినీ దగ్గరకు కూడా రానీయలేదన్న విషయం అందరూ చూసిందే.

 

ఇపుడు రాజధాని తరలింపులో తనకు కానీ పార్టీకి గాని జనాల నుండి పూర్తి మద్దతు దొరకటం లేదు.  29 గ్రామాల రాజధాని పరిధిలో ఇపుడు ఆందోళనలు జరుగుతున్నది కేవలం ఓ నాలుగైదు గ్రామాల్లో మాత్రమే. మరి మిగిలిన గ్రామాల్లోని రైతులు, మామూలు జనాలు ఎందుకు పట్టించుకోవటం లేదు ?  చంద్రబాబు చేసిన మోసం, తమను పెట్టిన కష్టం అందరికీ గుర్తుంది కాబట్టే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని ఎవరూ పట్టించుకోవటం లేదు. అందుకనే సెంటిమెంటును పండించేందుకు భార్య, బావమరిదిని రంగంలోకి దించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: