మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బయటి వారి నుంచి మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం... మహిళలపై అత్యాచారాలు జరగడం ఇలాంటి సంఘటన జరిగాయి  కానీ.. నేటి రోజుల్లో మాత్రం చిన్నారుల  నుండి పెద్దవాళ్ళ వరకు సొంత వారి నుండే  అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సొంత వారే లైంగిక వేధింపులు చేస్తున్నారు. అసలు లోకం తీరు  ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల ఆలోచనలో  మాత్రం మార్పు రావడంలేదు. తెలంగాణలో దిశ నిందితుల  ఎన్కౌంటర్ తర్వాత కూడా కామాంధుల్లో  కాస్తయినా భయం కనిపించడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెదనాన్న వరుసయ్యే యువకుడు నాలుగేళ్ళ చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ళ చిన్నారిపై వరుసకు పెద్దనాన్న అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.. కోణంపేట కు చెందిన బాధిత చిన్నారి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తోంది . భూపాలపల్లి మండలం నాగరానికి చెందిన చిన్నారి పెద్దనాన్న రాస కొమరయ్య ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడు. సమీపంలోని పత్తి చేనులో కి ఆ చిన్నారిని తీసుకుని ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు ఆ కిరాతకులు.. 

 

 

 ఇక తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మెలుకువ వచ్చి  చూసిన బాధిత చిన్నారి తల్లి... తన పక్కనే పడుకున్న కుమార్తె లేకపోవడంతో కంగారు పడింది. కుటుంబ సభ్యులందరి నిద్రలేపి ఈ విషయం చెప్పడంతో అందరూ కలిసి సమీపంలో వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఉదయం 7 గంటల సమయంలో పత్తి చేను నుంచి ఆ నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూ వస్తుండడం చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి చెప్పింది విని విసిగిపోయారు. వెంటనే బాధిత చిన్నారికి ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ చిన్నారి పై అత్యాచారం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: