టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంతకూ ఏ పార్టీ లో కొనసాగుతున్నారు?, జనసేనలోనా??, టీడీపీలోనా?? అన్నది ఆసక్తికరంగా మారింది . ఎందుకంటే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన జనసేన లో కొనసాగుతున్నారేమోనన్న అనుమానం రాకమానదు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలకు కౌంటరిచ్చే క్రమం లో పవన్ పట్ల తనకున్న విధేయతను చాటుకునేందుకు బోండా ఉమా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాఫిక్ గా మారింది . పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని ఇటీవల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు విమర్శిస్తున్న విషయం తెల్సిందే .

 

దానికి బోండా ఉమా మీడియా తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి . పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడని వైస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారని , మరి వైస్సార్ కాంగ్రెస్ నేతలు జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలా అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాణ్ పేరెత్తే అర్హత మీకుందా? అంటూ  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను బోండా ఉమా నిలదీశారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెంపుడు కుక్కల్లా, పెయిడ్ ఆర్టిస్టుల్లా ప్రెస్ మీట్లు పెడుతూ పవన్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు . ఒకడు పవన్ నాయుడు అంటున్నాడని , అవును పవన్ నిజంగానే నాయుడని బోండా ఉమా అన్నారు .

 

అంతటితో ఆగకుండా మీసం మీద చెయ్యేసి చెబుతున్నానని పవన్ నాయుడేనని , పాలకొల్లు నాయుడంటూ బోండా ఉమా   చెప్పుకొచ్చారు . మీకు అనుమానం ఉంటే మీ డిఎన్ఏ లు చెక్ చేసుకోవాలని , అంతేకాని పవన్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని విరుచుకుపడ్డారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తరువాత బోండా ఉమా , జనసేనలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది . ఆయన పార్టీ మారకపోయినా , పవన్ పట్ల తనకున్న విధేయతను ఈ విధంగా చాటుకున్నారన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: