సమాజంలో ఒక మనిషి మనిషిగా పుట్టాక ఎలా బ్రతకాలో కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసారు మన పెద్దలు. కాని నేడు ఆ కట్టుబాట్లు, వినడానికే తప్పా, ఆచరించడానికి, ఆదరించడానికి పనికి రావడం లేదు. ఎందుకంటే మనుషుల్లో వింతపోకడలు ఎక్కువయ్యాయి. మనది కాని సంస్కృతి, సాంప్రదాయం అలవాటు చేసుకుని ఇదే నా జీవితం అంటూ మనుగడ సాగిస్తున్నాడు. తాను చేసే పని తప్పు అని తెలిసినా దాన్ని తప్పుగా ఒప్పుకోలేక ప్రలోభాలకు బానిసగా మారి అడ్డదార్లో తన జీవితాన్ని సాగిస్తున్నాడు..

 

 

ఇదిగో ఇప్పుడు ఓ ప్రేమ జంట కూడా ఇలాగే తప్పుడు మార్గంలో, తప్పుడు పనులు చేసి ప్రాణాలు కోల్పయింది. ఆ వివరాలు చూస్తే..  ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా పవిత్రమైన దేవాలయాన్ని మార్చుకుంది.. ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

 

 

అదేమంటే కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో పడి. తన కలాపాల కోసం సాయంత్రం ఆలయం మూసాక బైక్‌పై అక్కడికి చేరుకునేవారు. ఇలా వచ్చే వారిని చూసిన గ్రామస్దులు మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని భావించారు. కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో అనుమానంతో  వారి పై ఓ కన్ను వేసారు. వారు వచ్చాక ఆ ఆలయంలో ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్లేసరికి అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది.

 

 

గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా తలమునకలయ్యారు. అక్కడికి చేరుకున్న గ్రామస్దులు వారిని పట్టుకుని, గుడిలో ఇలాంటి పనులు ఏమిటని వాళ్లి ఇద్దరికీ నాలుగు తగిలించారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు. కాని అందరు చూసారన్న సిగ్గుతో ఏమో తెలియదు గాని హడావుడిగా భయం భయంతో బైక్ ఎక్కువ ఫాస్ట్ గా వెళ్లనివ్వడంతో యాక్సిడెంట్ అయ్యి ఆ ప్రేమికులు ఇద్దరు అక్కడిక్కక్కడే మరణించారు... ఇది వారు చేసిన తప్పుకు దేవుడు వేసిన శిక్షనో ఏమో తెలియదు గాని ఈ ఘటన ప్రతి వారికి కనువిప్పు కలిగేలా ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: