రాక్ష‌సులు... పురాణాలు, ఇతిహాసాల్లోనే లేరు. ఇప్ప‌టికీ ఉన్నారు. మ‌న మ‌ధ్య‌లోనే తిరుగుతున్నారు. మ‌నుషుల రూపంలోనే...కుటుంబ స‌భ్యుల వ‌లే... క‌లుపుగోలుగా ఉంటూ....దారుణానికి ఒడిగ‌డుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే... ఈ విష‌యం మీకు అనేక సందర్భాల్లో గుర్తుకు వ‌స్తుంటుంది. తాజాగా అది నిజ‌మ‌ని మ‌రోమారు స్ప‌ష్టం అయ్యే ప‌రిస్థితి ఇది. కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆ ఘ‌ట‌న అత్యంత పాశ‌వికంగా ఉంది. నిందితుడి చ‌ర్య ఒళ్లు గ‌గుర్పాటుకు గురిచేస్తోంది.

 

బాబు అనే వ్యక్తి జి.కొండూరు మండలం మునగపాడులో వదినకు వరసయ్యే మహిళపై దారుణ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. వ‌దిన‌ను అత్యంత దారుణంగా రేప్ చేసిన ఆ దుర్మార్గుడు అనంత‌రం మ‌రింత రాక్షసంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె జననాంగాన్నికోసి వేసి త‌న రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న స‌భ్య స‌మాజం త‌లదించుకునేలా ఉండ‌ట‌మే కాకుండా.... మ‌హిళ‌ల భ‌ధ్ర‌త విష‌యంలోనూ అనేక అనుమానాలు క‌లిగిస్తోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

 

జ‌రిగిన దారుణం నుంచి కొద్దిసేప‌టికి కోలుకున్న ఆ బాధితురాలు 100 నంబ‌రుకు డ‌య‌ల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం అందించింది. వెంట‌నే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వ‌ద్ద నుంచి ఆ దుర్మార్గుడి వివ‌రాలు సేక‌రించ‌గా....వాడి నివాసం స‌హా త‌ల‌దాల్చుకునే ప్రాంతాల్లో వెతికారు. అయితే బాబు అనే ఆ రాక్ష‌సుడు ప‌రారీలో ఉన్నాడు. ఆ రాక్ష‌సుడిని ప‌ట్టుకునేందుకు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య సేవ‌లు అందిస్తున్నారు. ఆమె కోలుకున్న అనంత‌రం వాంగ్మూలం స్వీక‌రించ‌నున్నారు. కాగా ఈ దారుణ ఘ‌ట‌న మీడియాలో వైర‌ల్ అయిన నేప‌థ్యంలో పోలీసు ఉన్న‌తాధికారులు సైతం స‌మాచారం అడిగి తెలుసుకున్నార‌ని అంటున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో నిందితుల‌ను ప‌ట్టుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: