పెళ్లయినాక పిల్లలు పుట్టకపోతే దంపతుల మధ్య తీవ్ర నిరాశే మిగులుతుంది. అదే, భర్తలో లోపం ఉందని తెలిస్తే ఆ బాధ మాటల్లో వివరించలేం. ఒకవైపు బంధువుల్లో మగతనం లేదని సూటిపోటి మాటలు ఎదుర్కొంటూ.. మరోవైపు భార్య ముందు తలెత్తుకోలేక ఏ భర్తయిన మానసికంగా కృంగిపోతాడు. అయితే, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి తమిళనాడు చెందిన ఒక వ్యక్తి తనకు పిల్లలు పుట్టట్లేదని బాధ ఎక్కువై తన మర్మాంగానే కోసేసుకున్నాడు.


వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాజధానైనా చెన్నై లోని వాషెర్ మాన్ పెట్ కు చెందిన బాబు(40)కి దేవి(35)తో పెళ్ళై కొన్నేళ్లు కావొస్తుంది. అయితే, వారికి వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు మాత్రం పుట్టడంలేదు. వైద్యులను కన్సల్ట్ అయితే బాబులో లోపముందని తేల్చి చెప్పారు. ఆరోజు నుండి దేవి భర్త బాబుతో తరచూ గొడవపెట్టుకునేది. అయితే, మొన్న న్యూ ఇయర్ రోజు కూడా వాళ్ళ మధ్య తగాదా ఏర్పడింది. దాంతో, భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది.


ఇంట్లోనే ఒంటరిగా ఉన్న భర్త బాబు.. మద్యం తాగడం మొదలుపెట్టాడు. ఒక వైపు భార్యతో గొడవలు, మరొక వైపు తనకు పిల్లలు పుట్టలేదన్న బాధ బాబుని బాగా డిస్టర్బ్ చేసాయి. దాంతో అతడు కిచెన్ లోకి వెళ్లి ఒక కత్తిని తెచ్చుకొని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. అయితే, తీవ్రమైన గాయం అవ్వడంతో ఆ నొప్పిని భరించలేక అక్కడి ప్రాంతం దద్దరిలెట్లు ఏడవడం మొదలుపెట్టాడు బాబు. దాంతో, ఆ వీధిలోని వారంతా వచ్చి అక్కడి దృశాన్ని చూసి నిర్గాంతపోయారు. వెంటనే సమీపంలోనున్న ఒక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెబుతున్నారు. ఒక పాపనో లేదా బాబు నో అనాథ ఆశ్రమం నుండి తెచ్చుకొని సొంత బిడ్డలా పెంచుకున్నట్లైతే బాగుండేదని ఇరుగుపొరుగు వారు మీడియా ముందు మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: