ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన  3 రాజధానుల  ప్రకటన  రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రస్థాయిలో... జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు విరుచుకు పడుతున్నాయి. విశాఖ లో భారీగా వైసీపీ నేతలు భూములు కొన్నారని అందుకే జగన్మోహన్రెడ్డి విశాఖకు రాజధాని మార్చాలి అనుకుంటున్నారు  అంటు  విమర్శిస్తున్నారు ప్రతిపక్ష టిడిపి నేతలు. 

 


 ఈ క్రమంలోనే టిడిపి నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. విశాఖలో రాజధాని కావాలి అని జగన్ ప్రభుత్వాన్ని ఎవరు అడిగారు అని... విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అంటూ టిడిపి నేత యనమల రామకృష్ణుడు  వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని కొత్తగా మీరు అభివృద్ధి చేసేది ఏమిటి అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి నుంచి రాజధాని మార్పు చేస్తే ఊరుకోబోమని... అమరావతిని అభివృద్ధి చేయాలి అంటూ హెచ్చరించారు 

 


 అయితే టిడిపి నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పై చేసిన విమర్శలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా  ఆయన పై సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన నగరి ఎమ్మెల్యే రోజా... పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారు అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారని... పుచ్చిపోయిన పొన్నుకు సింగపూర్ వెళ్ళమని ఎవరు చెప్పారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంటు రోజ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం నగిరి ఎమ్మెల్యే రోజా ట్వీట్ పై  నెటిజన్లు  విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే గత  ప్రభుత్వ హయాంలో వాళ్ళు దోచుకున్నారు అని ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు అని ప్రజలు అంటున్నారు అంతే కదా మేడం మీరు అన్నదానికి  అర్థం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: