ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.                    

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ ''సీఎం జగన్ గారెప్పుడూ మాట తప్పరు. అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావం. తమరెప్పుడూ మాట మీదుండరు చంద్రబాబూ. అది మీ నక్కజిత్తుల కపట గుణం. యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేక పోవడం మీ కర్మ. మీరు మారాలని ఎవరూ కోరుకోవడం లేదు. అలాగే ఉండండి.'' అంటూ ట్విట్ చేశారు. 

 

సీఎం జగన్ మాట ఎప్పుడు తప్పలేదు అని.. ఇచ్చిన మాటకు కట్టుబడి అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అని.. నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడవు అంటూ చంద్రబాబుని ఏకిపారేశారు విజయసాయి రెడ్డి. నీ జీవితకాలం యూ టుర్న్లు తీసుకోడానికే సమయం సరిపోయింది.. ప్రజలను ఎల్లకాలం మోసం చెయ్యలేరని కాస్త గుర్తించుకోండి అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: