తెలంగాణ సీఎం ప్రాణాలకు ముప్పు ఉందట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇటీవల తరచూ మంత్రులు త్వరలో కేటీఆర్ సీఎం కాబోతున్నాడంటూ చెబుతున్నారు. దీనిపై స్పందిచిన రేవంత్ రెడ్డి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వార్తలు చూస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఆయనకు రక్షణ కల్పించాలిని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు.

 

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. పదవి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చు పెడుతుందన్నారు రేవంత్ రెడ్డి. ‘కేటీఆర్‌ను సీఎం చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రిని మెత్త పెట్టి ఒత్తిండంటే ఏదైనా జరగరానిది జరగొచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రాణాలకు రక్షణ ఉండాలంటే.. కేటీఆర్‌ను ప్రగతి భవన్‌ నుంచి ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దరిపల్లి రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా శనివారం కర్మన్‌ఘాట్‌లో రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఇటీవలి కాలంలో త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ వంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగానే చేశారు. కేసీఆర్ కూడా ఒక దశలో కేటీఆర్ ను సీఎంను చేసి.. తాను జాతీయ రాజకీయాలకు వెళ్లిపోవాలని అనుకున్నారు.

 

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఫలితాలు రాబట్టడంతో ఆయన వ్యూహాలు తలకిందులయ్యాయి. ఆ తర్వాత ఈ తరహా ప్రచారం కొద్దికాలం సద్దుమణిగినా ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. కేటీఆర్ ఎప్పుడైనా సీఎం కావచ్చని టీఆర్ ఎస్ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: