2020 తొలి ఆదివారం గల్లీ నుంచి ఢిల్లీ వర్క్ కాకుండా అంతర జాతీయ సమాచారాన్ని అందులోను ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. గువాహటిలో శ్రీలంకతో భారత్ తొలి టి20 మ్యాచ్ ఈ ఆదివారం జరగనున్నది. హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై రాకపోకలు షురూ. 2020 జనవరి 5 వ తేదీ అర్ధరాత్రి తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. అదేవిధంగా ఇదే రోజున తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ఖరారు చేయనున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక జాతీయ సమాచారం విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ రాక వాయిదా వేసుకున్నారు.
తెలంగాణ వార్తలు..
► పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి..
► నేడు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎన్నికల సంఘం..
► బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై రాకపోకలు షురూ!..
► ట్రయల్ రన్ నిర్వహించిన సీపీ, మేయర్, ట్రాఫిక్ పోలీసులు..
► క్యాట్ ఫలితాలు విడుదల..
► వరంగల్ నిట్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు..
► ఆపరేషన్ మస్కాన్లో 3,636 మంది బాలల గుర్తింపు..
► 3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు..
► నేడు కూడా తనిఖీలు..
► ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు
►రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ..
► నేడు అఖిల భారత సైనిక పాఠశాల 2020-2021 ప్రవేశ పరీక్ష ..
► నేడు అర్ధరాత్రి తర్వాత తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు..
► రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ..
► నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు..
► శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..
జాతీయం
► జేఈఈ మెయిన్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ ..
► రేపటి నుంచి ఈ నెల 11 వరకు..
► ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష, 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్..
► న్యూమరికల్ వ్యాల్యూ సబ్జెక్టుకు ఐదు ప్రశ్నలు..
స్పోర్ట్స్ వార్తలు..
► నేడు గువాహటిలో శ్రీలంకతో భారత్ తొలి టి20 మ్యాచ్ ..
► రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1 లో ప్రత్యక్ష ప్రసారం..
అంతర్జాతీయ వార్తలు
► ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ రాక వాయిదా.