పాము కనిపిస్తే భయంతో పరిగెత్తె మనుషులు ఉన్న ఆ చుట్టు పక్కల ఒకతాగుబోతు, తాగిన నిషాలో భయం అనేది లేకుండా ప్రవర్తించాడు. సాధరణంగా ఎవరికైన పాము ఎదురుగా వస్తే పక్కకు తప్పుకుని దూరంగా వెళ్లుతారు. లేదా దైర్యం ఉన్నవారు దాన్ని ఎలాగోలా చంపేస్తారు. ఇక పాములు పట్టే వారైతే దాన్ని చంపకుండా పట్టుకుని దూరంగా ఎక్కడైనా వదిలేస్తారు.

 

 

ఇక పసి పిల్లలకైతే పాముకు, పులికి తేడా తెలియదు. పసివారిలాగానే ఫుల్ గా తాగిన మందుబాబులకు కూడా భయం అనేది తెలియదు. తాగినవాడి నోటి నుండి నిజాలు అలా తన్నుకువస్తాయంటారు. అందుకే మందుతాగినప్పుడు అంతవరకు తెలియని సీక్రెట్స్ గాని పర్సనల్ విషయాలుగాని సంకోచం లేకుండా బయటకు కక్కేస్తాడు. అదంతా నిషా మహిమ. ఈ మద్యం తాగుబోతుల పాలిట అమృతం. ఇక తాగినవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మితిమీరి తాగిన వ్యక్తి మనిషిలా ప్రవర్తించక మృగంలా కూడా ప్రవర్తించవచ్చూ. లేదా ఇంకా కిరాతకంగా ఏదైనా చేయవచ్చూ.

 

 

ఎక్కువగా నేరాలు చేసిన వారిగురించి తెలుసుకుంటే ధైర్యం కోసం తాగి ఆ తాగిన మత్తులో ఏం చేసామో తెలియకుండా జరిగిందనే చెబుతారు. మందు తాగిన మనుషులకు విచక్షణ జ్ఞానం పూర్తిగా నశిస్తుందని నిరూపించబడింది. ఇకపోతే రాజస్థాన్‌లోని దూసై జిల్లాలో ఓ మందుబాబు మద్యం మత్తులో పాముతోనే పరాచకాలు ఆడాడు. పాట పాడుతూ దాన్ని బాగా ఎంటర్‌టైన్ చేశాడు.

 

 

అంతటితో ఆగకుండా దాన్ని చేత్తో పట్టుకుని, మెడలో వేసుకుని పిచ్చెక్కించాడు. ఆ తర్వాత దాన్ని చంపేశాడు. ఇంతపని చేసిన ఆ తాగుబోతు పేరు ప్రకాష్ మహావర్‌గా గుర్తించారు. ఇక పామును పట్టుకునే క్రమంలో అది మూడుసార్లు కాటేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరుకూడా చూసి ఎంజాయ్ చేయండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: