ఆపరేషన్ గరుడ అంటూ హీరో శివాజీ అప్పట్లో నానా రచ్చ చేశారు. భారతీయ జనతా పార్టీపై మరియు ప్రధాని మోడీ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో మండిపడింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టార్టింగ్ లో చంద్రబాబు పై కూడా విమర్శలు చేసి  ఆ తర్వాత 2019 ఎన్నికల సమయానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడి అనేక న్యూస్ ఛానల్ లో తీవ్రస్థాయిలో వైసిపి పార్టీ పై మరియు నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడిన శివాజీ ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కేసుకు సంబంధించి ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అక్రమంగా దేశం వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నించి చివరాకరికి పోలీసులకు చిక్కాడు.

 

అయితే ఆ గొడవ జరిగి కొన్ని నెలలు కావస్తున్నా క్రమములో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శివాజీ తాజాగా రాజధాని అమరావతి గురించి గొడవలు అవుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ స్టూడియోలో కూర్చుని రాజధాని అమరావతి గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక ఫోన్ కాలర్ ఫోన్ చేసి స్టూడియోలో ఉన్న యాంకర్ కి చెల్లెలని... సొంత పిన్ని కూతుర్ని లేపుకెళ్లి పోయిన వాడిని స్టూడియోలో ఎందుకు కూర్చోబెట్టారు..? అంటూ మాట్లాడటంతో వెంటనే శివాజీ అందరూ చూస్తుండగా లైవ్ లో విమర్శించడంతో ఆ వీడియో వైరల్ అయింది.

 

దీంతో శివాజీని ఇరుకున పెట్టాలని ఎప్పుడు దొరుకుతాడో అని ఎదురుచూస్తున్న రాజకీయ ప్రత్యర్ధులు లైవ్ లో కాలర్ ని బూతులు తిట్టాడు అనే వంక పట్టుకుని - ఆ కాలర్ ని రంగం లోకి దింపి .. అరస్ట్ కి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అంతేకాకుండా కుదిరితే సదరు న్యూస్ ఛానల్ పై కూడా కేసు పట్టించే విధంగా ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా హీరో శివాజీ స్టూడియో లో కూర్చుని అధికారపార్టీకి వ్యతిరేకంగా దారుణంగా అమరావతి రాజధాని విషయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ నేతలు కూడా హీరో శివాజీ మాట్లాడిన తీరు పై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: