ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.                     

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ... ''విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుంది. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

చెప్పాలంటే.. ఈ ట్విట్ తో ఒకరకమైన స్వీట్ అండ్ హాట్ వార్నింగ్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. రకరకాల మేనిప్యులేషన్లతో తప్పించుకుంటున్నావ్ బాబు.. చేసిన తప్పుల నుండి శాశ్వతంగా ఎవరు బయటపడలేరు.. ఈ విషయం నీకు త్వరలోనే అర్థం అవుతుంది బాబు అంటూ.. చెప్పినట్టే చెప్పి వార్నింగ్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. కాగా విజయసాయి రెడ్డి ట్విట్ చుసిన కొందరు  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్విట్ వల్ల వైసీపీ టీడీపీ పార్టీ అభిమానుల మధ్య చిన్నపాటి  జరిగింది. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: