దేశంలోనే పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా అత్యధికంగా పార్లమెంటు సభ్యులు కలిగిన పార్టీగా వైసిపి పార్టీ విశిష్ట దక్కించుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఇలాంటి నేపథ్యంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుని చమటలు పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సంచలన కరమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ నాయకులనే ప్రభావితం చేసే విధంగా పాలనలో దూసుకుపోతున్న జగన్ ని కట్టడి చేయడానికి బిజెపి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది.

 

ఇప్పటికే జగన్ ని అక్రమాస్తుల కేసు విషయంలో సిబిఐ కోర్టు ద్వారా మళ్లీ ప్రతి శుక్రవారం హాజరయ్యేలా వెనక నుండి బిజెపి పార్టీ పెద్దలు చక్రం తిప్పారు అన్న వార్తలు జాతీయ మీడియాలో బలంగా వినబడుతున్న తరుణంలో వికేంద్రీకరణ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అంతట జరగాలని మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది వివిధ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విభేదిస్తున్నారు.

 

ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడా అని జగన్ ప్రభుత్వం పై ప్రజలనుండి వ్యతిరేకత తీసుకురావాలని అనేక విషయాలను లేవనెత్తి జగన్ ప్రభుత్వం పై ఇటీవల విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బీజేపీ పవన్ కళ్యాణ్ తో కుమ్మకు కావడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇందు మూలంగానే బిజెపి హైకమాండ్ తన పార్టీకి చెందిన యువ ఎంపీల చేత పవన్ కళ్యాణ్ తో బేటీ చేయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఎలాగైనా జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీసుకురావాలని సరైన స్కెచ్ వేసినట్లు త్వరలోనే అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ నాయకులు భారీ ఎత్తున జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: