వైసిపి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులను మరియు అదే విధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేసుకుని మోహన్ బాబు చేసిన విమర్శలు అప్పటి ఎన్నికల ప్రచారం లో హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు తాను అధికారంలో ఉన్న సమయంలో తన విద్యా సంస్థలకు సంబంధించి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మోహన్ బాబు మాట్లాడుతూ ఎన్నికలకు నెల రోజులు ఉందనగా జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు మోహన్ బాబు.

 

ఇటువంటి నేపథ్యంలో గత కొన్ని నెలల నుండి జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నా మోహన్ బాబు సడన్ గా ఢిల్లీలో నరేంద్ర మోడీ ని కలవడం జరిగింది. దాదాపు అర గంటకు పైగా ప్రధాని మోడీ తో మోహన్ బాబు ఆంధ్ర రాజకీయాల గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలోనే బిజెపి పార్టీలో చేరడానికి మోహన్ బాబు రెడీ అవుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా మోహన్ బాబు కలవనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వల్ల కానిది మోహన్ బాబుకి ఇలా డిల్లీ వెళ్లడంతో అలా అపాయింట్మెంట్ ప్రధాని మోడీ మరియు అమిత్ షా దగ్గర దొరకటంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మొత్తంమీద చూసుకుంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు జగన్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో అప్పట్లో మోడీని మరియు అమిత్ షా ని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు జగన్ చేసినా... సరిగ్గా కనీసం పట్టించుకోవడం లేదు. ఇటువంటి తరుణంలో లక్కీగా మోహన్ బాబుకి వాళ్ళు అపార్ట్ మెంట్ ఇవ్వటం నిజంగా హైలెట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: