దిశ ఘటన మరవకముందే మరొక ఘోరమైన దారుణం జరిగి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక మతిస్థిమితం లేని అమ్మాయిని కొంతమంది దుండగులు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసారు. ఆ అమ్మాయికు అమ్మ నాన్న కూడా లేరని.. చాలా మంచి పిల్ల అని స్థానిక ప్రజలు చెబుతూ తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెప్పిన ప్రకారం ముగ్గురు తాగుబోతులు ఆ అమ్మాయిని ఒక పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేసారని తెలుస్తుంది.


ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ... ' నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని చవటపాలెంలో పర్వీన్ అనే సుమారు 30సంవత్సరాల వయసున్న ఒక మహిళను సామూహిక మానభంగం చేసి, ఆ తరువాత కొట్టి చంపారని తెలుస్తుంది. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.' అని చెప్పారు.


నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ.. 'నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైన ఘటన జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించడం జరిగింది. ఆ ఆధారాలను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు పంపించాం. ముద్దాయిలను త్వరలోనే పట్టుకుంటాం.' అని అన్నారు.


నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామ సచివాలయం సమీపంలోని ఒక పాడుబడ్డ భవనంలో పర్వీన్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దిశ కేసు లోని నిందితుల చావు చూసిన తరువాత కూడా ఈ మగ మృగాళ్లు నేరాలకు పాల్పడటం గమనార్హం. ఈ నీచులకు కూడా అదే తరహాలో శిక్ష పడాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఏదేమైనా అభం శుభం తెలియని అమ్మాయిని హత్యాచారం చేసిన ఈ దుర్మాగ్గులకు నెల రోజుల్లోనే దిశ చట్టం ద్వారా మరణ శిక్ష పడాలని, వారికి ఉరి తక్షణమే అమలు కావాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: