పురుషులు కానివ్వండి, మహిళలు కానివండి. ఈ మద్యకాలంలో వివాహేతర సంబందాలపట్ల చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారనే విషయం తెలుస్తూనే ఉంది. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ఇలాంటి వార్తలే చెవుల్లో తుమ్మెదలా చప్పుళ్లు చేస్తున్నాయి. అసలు లోకంలోని మనుషులకు ఇదేం మాయరోగమో తెలియదు గాని, పర స్త్రీ గాని పర పురుషుడు గాని ఈ కామం అనే వ్యామోహంలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వారి వారి పరువును బజారుకీడ్చుకుంటున్నారు.

 

 

నూరేళ్ల వైవాహిక బందాన్ని ఒక్క పనితో తెగతెంపులు చేసుకుని, మూడుముళ్ల తాళికి, ఏడడుగుల ప్రయాణానికి అసలు విలువ లేదని నిరూపిస్తున్నారు. ఈ అక్రమ సంబందాలకు వయస్సుతో నిమిత్తం లేదు. అన్ని వయస్సుల వారు ఇలాంటి పాడుపనులకు పాల్పడుతున్నారు. ఇకపోతే వయసులో తన కంటే పెద్దదైన మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని తన భార్య పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదిన ఘటన కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్‌ల చోటు చేసుకుంది.

 

 

ఈ వివరాలను తెలుసుకుంటే, కరీంనగర్‌కు చెందిన అంజి అనే అతనితో, స్వాతి అనే మహిళకు తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది, వివాహమైన కొద్ది రోజులకే అంజి పరాయి స్త్రీ మోజులో పడి భార్యతో తరచూ గొడవపడటం ప్రారంభించాడు. భర్త ప్రవర్తనపై స్వాతి కారణాలను ఆరా తీయగా.. అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పెద్దలు, పోలీసులు కూడా అతని పద్దతి మార్చుకొని సక్రమంగా కాపురం చేయాలని సూచించారట.

 

 

అలాగే ఉంటానని నమ్మించిన అంజి సదరు మహిళతో గుట్టుగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి.. అర్ధరాత్రి బంధువులతో కలిసి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టి బడిత పూజ చేసారట. ఇక బాధితురాలి బందువులు మాట్లాడుతూ తమ ఆడపిల్లకు భారీగా కట్నకానుకలు సమర్పించి వివాహం జరిపిస్తే.. మరో మహిళతో సంబంధం పెట్టుకొని ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: