మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. మంచి వాళ్ళు ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారు చాలామంది. నెలలు నిండని పసికందు నుంచి పండు ముసలి వరకు  వయసుతో పనిలేకుండా కామం తీర్చుకోవడమే లక్ష్యంగా మృగాల్లాంటి మగాళ్లు మీద పడి అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసి వారిని  శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికే కూడా లైంగిక వేధింపులు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కామవాంఛ తెచ్చుకోవడమే లక్ష్యంగా కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో అమ్మాయిలు కామపు కోరలు చిక్కుకుంటున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు . ఇలాంటి ఘటనలు రోజు కోటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి.

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో 9 ఏళ్ల బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడు ఓ యువకుడు. బాలిక ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే... జయశంకర్ భూపాలపల్లి లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి లోని చల్లగరిగ గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లడంతో ఒంటరిగా ఉంది... ఇక ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన తోనగర్ లక్ష్మన్  బాలికను బలవంతంగా  ఇంట్లోకి లాక్కొని వెళ్లి  అత్యాచారయత్నం చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైన బాలిక కేకలు వేయడంతో లక్ష్మణ్  అక్కడి నుంచి పరారయ్యాడు. 

 

 

 బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకునేలోపే అత్యాచార యత్నం చేసిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇక సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది బాలిక. దీంతో  అదే రోజు రాత్రి బాలికతో వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ వీరభద్ర రావు   విచారణ ప్రారంభించారు. నిందితుడు లక్ష్మణ్ ను  టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వీరభద్ర రావు తెలిపారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: